ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు గారి కన్నా ముందే బ్రిటిషువారి పరిపాలనా విధానంపై తిరుగుబాటును లేవదీసి గొప్ప విప్లవ వీరునిగా పోరాడి వీరమరణం పొందినవారు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు.
ఈయన తూర్పు గోదావరిజిల్లా శంఖవరం మండలం నెల్లిపూడిలో మేనమామలైన తెలగాలు “రవణం” వారింట పెరిగారు.
ఆరడుగులు పైన ఆజానుబాహువైన విగ్రహ రూపం, తేనెరంగు శరీర ఛాయ, ఉంగరాల జుట్టు, వెనక జులపాలు కలిగి చింతపిక్క రంగు గుర్రంపై కూర్చుని తుపాకీతో, వీపుమీద కత్తి, మొలలో బాకు, చేతిలో గండ్ర గొడ్డలితో సంచారం చేసేవారు.
ఆరడుగులు పైన ఆజానుబాహువైన విగ్రహ రూపం, తేనెరంగు శరీర ఛాయ, ఉంగరాల జుట్టు, వెనక జులపాలు కలిగి చింతపిక్క రంగు గుర్రంపై కూర్చుని తుపాకీతో, వీపుమీద కత్తి, మొలలో బాకు, చేతిలో గండ్ర గొడ్డలితో సంచారం చేసేవారు.
బ్రిటిష్ వారి పాలనపై ఎంతో ఉదృతంగా జరిగిన ఈ తిరుగుబాట్లకు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు, పులిచింత సాంబయ్య, బొదులూరు అంబులురెడ్డి నాయకులుగా వ్యవహరించారు.. అనేక విధాలా బ్రిటిషు అధికారులను అడ్డగించి ఎదుర్కొన్నారు. చింతలూరు, పెద్దిపాలెం, కిర్లంపూడి, చిల్లంగి, జగ్గంపేట వంటిచోట్ల తిరుగుబాట్లను నిర్వహించి నాటి భూస్వాములు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులపై తిరుగుబాటు జరిపారు.
నాటి బ్రిటిష్ అధికారులు చాలామంది గిరిజన ఆడపిల్లలపై హత్యాచారాలకు పాల్పడేవారు. అటువంటి సైనికులను, పోలీసులను పట్టుకుని చంద్రయ్య నాయుడు తన గండ్ర గొడ్డలితో వారి తలలను నరికేసేవారు. బ్రిటిషు వారికి దొరకకుండా వారిని ముప్పుతిప్పలుపెడుతూ అటవీ ప్రాంతాలలో సంచరించేవారు. 1879 ఏప్రిల్ లో అడ్డతీగల పోలీసుస్టేషన్ ను ద్వంసం చేసి అక్కడ ఉన్న అనేక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.. అదేసంవత్సరం నవంబరులో వీరి అనుచరులను 79 మందిని నాటి బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు వలపన్ని పట్టుకుని వారందరినీ అతి కిరాతకంగా కాల్చి తలనరికి చంపేశారు. ఆ తరువాత 1880 ఫిబ్రవరి 12న చంద్రయ్యనాయుడుకు చాలా నమ్మకస్తునిగా, అనుచరునిగా ఉండే జంపా పండయ్య అనే వ్యక్తిని బ్రిటిష్ అధికారులు లోబరుచుకుని ఆతనికి గొప్ప బహుమతులు ఇస్తామని చెప్పి ఆతని ద్వారా ద్వారబంధాల చంద్రయ్యనాయుడును చంపి, తలనరికి ఆ తిరుగుబాట్లను నాటి బ్రిటిషు ప్రభుత్వం, దానికి తొత్తులుగా ఉన్న జమీందార్లు అణచి వేశారు.
అలా 1880 ఫిబ్రవరి 12వ తేదీన వీర మరణం పొంది వీరస్వర్గమునలంకరించిన ద్వారబంధాల చంద్రయ్య తరువాత అవతారమే జూలై 4, 1897లో అల్లూరి సీతారామరాజుగా జన్మించారని.. ఆయనే తమ కోసం మరలా వచ్చినట్టు మరలా ఆ బ్రిటిష్ వారి చేతులలో మే 7, 1924న వీర మరణం పొందినట్టు నాటి ప్రజలు విశ్వసించేవారు.
31 సంవత్సరాల వయస్సులోనే బ్రిటీషు వారి తుపాకి గుళ్ళకు బలైపోయిన స్వాతంత్ర సమరయోధుడు.
అల్లూరి సీతారామరాజు కంటే 45 సంవత్సరాల ముందువాడు అయిన ఆ స్వాతంత్ర సమరయోధుడి చరిత్రను పరిశోధించి నేటి తరానికి అందించిన శ్రీ భట్టరుశెట్టి పద్మారావు రాయిల్ గారు అభినందనీయులు.
109837 389380I real glad to uncover this web web site on bing, just what I was searching for : D likewise saved to bookmarks . 299778
551740 300460some truly interesting info , effectively written and broadly speaking user genial . 769869
775890 449556quite good publish, i definitely enjoy this internet web site, keep on it 831102
563374 606943Ive read several very good stuff here. Definitely value bookmarking for revisiting. I surprise how a lot effort you put to create 1 of these excellent informative site. 657827
214929 693628How will be the new year going? I hope to read a lot more intriguing posts like last year 591237
181683 190360hey there i stumbled upon your web site searching around the internet. I wanted to say I enjoy the appear of things about here. Keep it up will save for positive. 105521