ఆర్పీ అలియాస్ కిర్రాక్ ఆర్పీ.. జబర్దస్త్ కారణంగానే పాపులర్ అయ్యాడు. ఆ మాటకొస్తే, జబర్దస్త్ చాలామంది కమెడియన్లకు ‘లైఫ్’ ఇచ్చింది. ఆ వేదిక మీద నుంచే చాలామంది కమెడియన్లు తాము అంతకు ముందు జీవితంలో ఎన్ని కష్టాలు పడిందీ చెప్పుకొచ్చారు. ఈటీవీ కన్న తల్లిలాంటిదనీ, మల్లెమాల తమకు తిండి పెట్టిందనీ, జబర్దస్త్ వేదిక ద్వారా తమకు ఓ పెద్ద కుటుంబం ఏర్పడిందనీ చెప్పుకున్నారు కమెడియన్లు.
జబర్దస్త్ వల్లనే తాను ఎమ్మెల్యేనయ్యానని సినీ నటి రోజా కూడా చెప్పడం గమనార్హం. మంత్రి పదవి రాగానే, రోజా జబర్దస్త్ని వదిలెయ్యాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే సంగతి. నాగబాబు సైతం, జబర్దస్త్ కారణంగా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారనడంలో నిస్సందేహం.
ఇక, జబర్దస్త్ విషయానికొస్తే, సరదాగానే చాలామంది కంటెస్టెంట్లు మొదటి నుంచీ మల్లెమాలపై సెటైర్లేస్తూ వచ్చారు. అయితే, అప్పట్లో ఏడుకొండలు అనే వ్యక్తి మీద పదే పదే సెటైరికల్ కామెడీ పంచ్ డైలాగులు కంటెస్టెంట్లు పేల్చుతూ రావడం చూశాం.
టీమ్ లీడర్లు తమ కంటెస్టెంట్లకు పేమెంట్లు ఇవ్వకపోవడం దగ్గర్నుంచి, జడ్జిల విషయంలో, తోటి కంటెస్టెంట్ల విషయంలో కమెడియన్లు ఏమేం అనుకుంటున్నారన్నదానిపైనా బోల్డన్ని స్కిట్లు వచ్చాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే, జబర్దస్త్లో తిండి పెట్టడానికి కూడా ఏడ్చేవారంటూ మల్లెమాల సంస్థపై కిర్రాక్ ఆర్పీ సంచలన ఆరోపణలు చేశాడు.
ఓ యూ ట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. నాగబాబు తమను ఎలా ఆదుకున్నదీ, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎలా వేధించిందీ ఆర్పీ చెప్పడం గమనార్హం. బస్తీ మే సవాల్.. నేను చేసే ఆరోపణలన్నీ నిజమే.. అంటూ కిర్రాక్ ఆర్పీ చెలరేగిపోయాడు ఆ ఇంటర్వ్యూలో.
అక్కడ ఏమీ అలాంటివి జరగకపోతే, జడ్జిలు, కంటెస్టెంట్లు ఒకరొకరుగా ఎందుకు బయటకొచ్చేస్తారు.?
858519 141You seem to be really professional within the way you write.::~ 508140