Switch to English

ప్రభాస్ పెద్ద హీరో అవుతాడు అనుకున్నా కానీ ఈ స్థాయి ఊహించలేదు: కృష్ణంరాజు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

రెబెల్ స్టార్ కృష్ణంరాజు, తన వారసుడు ప్రభాస్ గురించి మాట్లాడుతూ గొప్ప స్టార్ అవుతాడు అని అనుకున్నాను కానీ ఈ ప్యాన్ ఇండియా స్థాయి అస్సలు ఊహించలేదు అని అన్నారు. ప్రభాస్ తన నటనా జీవితంలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. తన మొదటి సినిమా ఈశ్వర్ ఈరోజే అంటే 28 ఏప్రిల్ న 20 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 2002, ఏప్రిల్ 28న మొదటి షాట్ కు క్లాప్ కొట్టి కృష్ణంరాజు ప్రభాస్ ను దీవించారు. మొదటి సినిమా నుండి ఒక్కో మెట్టూ ఎదుగుతూ ప్రభాస్ ఈ స్థాయికి చేరుకున్నారు.

ప్రభాస్ 20 ఇయర్స్ కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి కృష్ణంరాజు ఇంట్లో సెలెబ్రేట్ చేసారు. ఈ వేడుకకు ఈశ్వర్ చిత్ర దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ, “మా ప్రభాస్ హీరోగా పరిచయమై అప్పుడే 20 ఏళ్ళు గడిచిపోయాయా అని అనిపిస్తోంది. నిజానికి ప్రభాస్ ను మొదట మేమె పరిచయం చేద్దామని అనుకున్నాం కానీ జయంత్ తో పాటు అశోక్ కుమార్ వచ్చి ప్రభాస్ ను లాంచ్ చేసే బాధ్యత ఇవ్వమని అడిగారు. కథ వినగానే బాగా నచ్చింది. అన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఎస్ చెప్పాం. సినిమాను చాలా బాధ్యతతో తెరకెక్కించారు. మంచి లాంచ్ దక్కింది. ఈశ్వర్ చూసాక ప్రభాస్ పెద్ద హీరో అవుతాడని ఊహించాం కానీ ఈ స్థాయి మాత్రం అస్సలు అనుకోలేదు. ప్యాన్ ఇండియా స్టార్ గా ఈరోజు ప్రభాస్ ఎదిగాడంటే కచ్చితంగా అతని శ్రమ, పట్టుదల, అభిమానుల అండదండలు కారణం. అతను మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.

ఈశ్వర్ దర్శకుడు జయంత్ మాట్లాడుతూ “నేను పరిచయం చేసిన ఒక హీరో ఈరోజు ప్యాన్ ఇండియా హీరో అవుతాడని అస్సలు అనుకోలేదు. ప్రభాస్ గొప్పవాడు. ఈశ్వర్ సమయంలో ఎలా ఉన్నాడో ఈ మధ్య కలిసినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నా హీరో ఈ రేంజ్ కు వెళ్లడం అనేది మర్చిపోలేని అనుభూతి” అని అన్నారు.

ఈశ్వర్ నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ, “ఈశ్వర్ సినిమాతో నిజానికి మా అబ్బాయిని హీరో చేద్దామని అనుకున్నాను కానీ అప్పుడే సినిమాల్లోకి రావడం కరెక్ట్ కాదేమో అనిపించింది. చాలా మందిని పరిశీలించి చివరికి ప్రభాస్ అయితే బాగుంటాడు అనిపించింది. కృష్ణంరాజును కలిసి ఆయన ఓకే అనడంతో ఈశ్వర్ పట్టాలెక్కింది. ప్రభాస్ ఆటిట్యూడ్ అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నాయి. ఈశ్వర్ సినిమా నిన్న, మొన్న తీసినట్లు ఉంది. అప్పుడే 20 ఏళ్ళు అయ్యాయా అంటే ఆశ్చర్యంగా ఉంది” అని అన్నారు.

కృష్ణంరాజు భార్య శ్యామల మాట్లాడుతూ, “ప్రభాస్ ను హీరో చేస్తున్నాం అనగానే రామానాయుడు స్టూడియో నుండి అన్ని రోడ్లు నిండిపోయాయి. మేము స్టూడియోకు వెళదామనుకుని కూడా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంతమంది అభిమానులు వచ్చారు. వాళ్ళ అండదండల తోనే ప్రభాస్ ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రభాస్ కు నేనే పెద్ద అభిమానిని. ప్రభాస్ ఇలాగె ఇంకా ఎత్తుకి ఎదగాలని అనుకుంటున్నా” అని అన్నారు.

ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు జె ఎస్ ఆర్ శాస్త్రి మాట్లాడుతూ “ప్రభాస్ హీరోగా పరిచయమై 20 ఏళ్ళు అయింది. ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అసలు ఈ వేడుకను భారీగా చేయాలనుకున్నాం కానీ కోవిడ్ సమస్య వల్ల కుదరలేదు” అని అన్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...