నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం జీకేపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు తమ పిల్లలను తీసుకుని బయటకు వెళ్లారు. వారు కనిపించకుండా పోవడంతో ఆ ఇద్దరు మహిళల భర్తలు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి స్థానికులను విచారిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి మరీ ఆ ఇద్దరు మహిళలు మరియు ముగ్గురు పిల్లల కోసం వెదుకుతున్నారు.
పోలీసుల కథనం ప్రకారం కృష్ణయ్య భార్య విజయ కుమార్తెలు శ్రీవేణి మరియు దివ్యశ్రీలు మరియు సుధాకర్ భార్య సుప్రియ మరియు కుమార్తె సురేఖలు స్థానికంగా ఉన్న పీహెచ్సీకి వెళ్లారు. దివ్యశ్రీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో గ్రామంలో ఉన్న పీహెచ్సీకి వెళ్లగా అక్కడ నెబ్లైజర్ లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నట్లుగా గ్రామస్తులకు చెప్పి ఆటో ఎక్కారు.
మొత్తం అయిదుగురు కూడా ఆటోలో వెళ్లారు. ఆ తర్వాత వారు ఎక్కడకు వెళ్లారు అనేది తెలియడం లేదు. వారిద్దరి ఫోన్ లు కూడా ఇంటి వద్దే ఉండటంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఫోన్ల డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు బృందాలుగా విడిపోయి వెదుకుతున్నారు. అతి త్వరలో వారిని పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
812218 930468It is onerous to search out knowledgeable individuals on this topic, however you sound like you already know what you are talking about! Thanks 860615
38971 897814Some truly good and beneficial info on this website, likewise I conceive the style holds exceptional capabilities. 440062
669359 173772As I internet site owner I believe the content material material here is extremely superb, thanks for your efforts. 779750
42297 25892I genuinely prize your function , Excellent post. 428426