‘ఫేస్ బుక్ మెసెంజెర్ లో పరిచయమైంది.. నమ్మించి కష్టసుఖాలు చెప్పుకుంది.. తనకెవరూ లేరనీ.. 28 కోట్ల ఆస్తి ఉందని చెప్పింది.. ఆస్తి నీకే రాసిస్తానని చెప్పింది.. స్నేహితురాలిగా నమ్మించింది.. బ్యాంకు డిటైల్స్ అడిగింది.. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు దోచుకుంది..’ ఇదంతా జరిగింది 2017లో. మోసపోయింది రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు చెందిన ఓ యువతి. ఫిర్యాదు చేసిన నాలుగేళ్ల తర్వాత పోలీసులు కేసును చేధించి మోసగాళ్లను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..
రాజస్థాన్ రాష్ట్రంలోని సామై మాధోపూర్ నగరానికి చెందిన ఓ యువతికి రెబెకా క్రిష్టినా అనే విదేశీ మహిళ ఫేస్బుక్ మెసేంజర్లో పరిచయమైంది. స్నేహితురాలిగా నమ్మించాక.. తన బాధలు చెప్పుకుంది. ‘నేను ఒంటరిగా జీవిస్తున్నా. ఈ మధ్యనే నా భర్త చనిపోయాడు. నాకెవరూ లేరు. పైగా.. నాకు కేన్సర్ వచ్చిందని డాక్టర్లు నిన్నే చెప్పారు. ఆరు నెలలకు మించి బతకను. నా బాధ నీతో చెప్పుకుంటుంటే ఉపశమనం లభిస్తోంది. దేవుడిచ్చిన చెల్లిలా అనిపిస్తున్నావు. నాకున్న 3.9 మిలియన్ డాలర్లు (దాదాపు 29 కోట్ల రూపాయలు) ఆస్తిని నీకు రాసిచ్చేస్తా.’ అని చెప్పింది. ఇవన్నీ నిజమేనని నమ్మిందా యువతి.
మొత్తంగా కొన్ని రోజుల తర్వాత.. ‘ఆస్తి నీ పేరు మీదకు మార్చేశాను.. డబ్బు, నగలను కూడా పంపిస్తున్నా..’ అని రెబెకా చెప్పింది. తన లాయర్, ఆదాయపన్ను అధికారులు ఫోన్ చేస్తారనీ, వాళ్లడిగిన వివరాలు ఇవ్వాలని చెప్పింది. వారు నగదును భారత్ కరెన్సీలోకి మార్చి నిన్ను యజమానిగా చేస్తారని చెప్పింది. చెప్పినట్టుగానే ఇద్దరు వ్యక్తులు యువతికి ఫోన్, ఈమెయిల్స్ వచ్చాయి. ప్రోపర్టీ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఫారిన్ ఎక్ఛేంజ్ ట్యాక్స్.. అంటూ 2.5 కోట్లు 55 బ్యాంక్ అకౌంట్లలో బదిలీ చేయించుకున్నారు.
ఇదిలా కొనసాగుతూండటంతో అనుమానం వచ్చిన యువతి.. తాను మోసపోయినట్టు గ్రహించింది. జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుంచీ విచారణ చేస్తే మొత్తానికి ఉత్తరాఖండ్ లోని ముస్సోరీకి చెందిన నీరజ్ సూరి ఈ సైబర్ క్రైమ్కు సూత్రధారని తేలింది. కొందరు నైజీరియన్లు నీరజ్ కి సహకరించారని తేల్చారు. జూన్ 20న నీరజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.
162447 884844I dont leave plenty of comments on a lot of blogs each week but i felt i had to here. Do you need numerous drafts to make a post? 638807