ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై రూమర్లు ఎక్కువయ్యాయి. ఎవరైనా సెలబ్రిటీ సోషల్ మీడియాలో కొంచెం తేడాగా పోస్ట్ పెడితే వెంటనే వారిపై ఏవో వదంతులు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లయిన సెలబ్రిటీలయితే సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ లు పెట్టిన వెంటనే పలానా జంట విడిపోతున్నారంటూ రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులో సింగర్ గీతామాధురి( Geetha Madhuri), యాక్టర్ నందు( actor Nandu) దంపతులు కూడా చేరిపోయారు. సాధారణంగా వీళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అప్పుడప్పుడు ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఐతే వీరిద్దరూ తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఆ మాటలపై స్వయంగా నందు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను నటించిన వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’ ప్రమోషన్స్ లో భాగంగా దీని గురించి మాట్లాడారు.
సోషల్ మీడియాలో తమ విడాకుల గురించి వస్తున్న వార్తలను చూసి తామిద్దరూ నవ్వుకున్నట్లు తెలిపారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అలాంటి వాటిని నమ్మవద్దని సూచించారు. అలాంటి న్యూస్ ని పట్టించుకోమని స్పష్టం చేశారు. గీతా మాధురి- నందు లది ప్రేమ వివాహం. వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు వీరికి దాక్షాయిని ప్రకృతి అనే పాప కూడా ఉంది. నందు ప్రస్తుతం క్రికెట్ ప్రెసెంటర్ గా ఉంటూనే మరోవైపు వెబ్ సిరీస్, సినిమాలు చేస్తున్నారు. ఇక గీతామాధురి కూడా పలు షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.