ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, రాష్ట్రంలో పరిస్థితి ఏంటి. ఓటర్లలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వుందా.? సంక్షేమ పథకాలు ఎంతవరకు ఓటు బ్యాంకుని పదిలం చేయగలుగుతున్నాయి.? తెలుగుదేశం పార్టీ సర్వనాశనమైపోయిందా.? ఏమన్నా పుంజుకుందా.? అధికార పార్టీ ఎమ్మెల్యేల పని తీరు ఏంటి.? మంత్రుల పని తీరు ఎలా వుంది.? ఇలా పలు అంశాలపై ఓ బులుగు సర్వే జరిగిందట. వైసీపీ అనుకూల వర్గానికి చెందిన ఓ ‘స్వతంత్ర’ సంస్థ (?!) ద్వారా సర్వే చేయించారట.
ఈ సర్వే జరుగుతున్న సమయంలో శాంపిల్స్ కొంచెం తేడా కొట్టడంతో, మరింత రహస్యంగా సర్వే జరిపి, నివేదికను నేరుగా వైసీపీ అధినాయకత్వానికి అందించారట. అందులో విషయాలు వాస్తవామా.? కాదా.? అన్న విషయమై ఇంకోసారి కూడా సరిచూసుకున్నారట. ఎన్నిసార్లు ఎంతలా కిందా మీదా వేసినా రిజల్ట్ ఒకటేనట. అదేంటంటే, 60 మంది ఎమ్మెల్యేలు దారుణంగా ఓడిపోబోతోతున్నారట. మరో 15 నుంచి 25 మంది వరకు ఎమ్మెల్యేలు టఫ్ ఫైట్ ఎదుర్కోబోతున్నాట ప్రత్యర్థి పార్టీల నుంచి. మంత్రుల్లోనూ ఆరుగురి వికెట్లు పడిపోబోతున్నాయట.
సంక్షేమ పథకాలు ఎడా పెడా అమలు చేస్తున్నా నరకానికి కేరాఫ్ అడ్రస్ అయిపోయిన రోడ్లు, పెరిగిపోయిన ధరలు, కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు దొరక్కపోవడం.. ఇలా చాలా కారణాలు అధికార పార్టీకి సంకటంగా మారాయంటున్నారు. ఇక, నివేదిక అందుకోగానే, ఓడిపోయే క్యాండిడేట్ల స్థానంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసే దిశగా నామినేటెడ్ పోస్టులకు తెరలేపిందట వైసీపీ అధిష్టానం. ఇదంతా మే నెలలో జరిగిన సర్వే, తదనంతర పరిణామాల సారాంశమని అంటున్నారు. ఈ రెండు నెలల్లో అధికార పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందట.
అదేంటీ, స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తిరుగు లేదు కదా.? అంటే, అధికారంలో వున్న పార్టీ.. అధికారాన్నంతా కేంద్రీకరించి ఇలాంటి ఎన్నికల్లో ఏకగ్రీవ గెలుపులు సొంతం చేసుకోవడం వింతేమీ కాదని వైసీపీకి చెందిన ఓ సీనియర్ నేత ఆఫ్ ది రికార్డ్గా అభిప్రాయపడ్డారట. పార్టీ పరిస్థితి బాగా లేదని, సీనియర్లు కొందరు అధినేతకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన వినే పరిస్థితుల్లో లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్నది ఇంకొందరి అభిప్రాయం.
కాగా, గత ఎన్నికల్లో ఏయే చోట్ల పూర్తిగా టీడీపీ గల్లంతయ్యిందో, ఆ ప్రాంతాల్లో టీడీపీ తిరిగి పుంజుకుందని వైసీపీ సర్వేలోనే తేలిందంటున్నారు. ఇదిలా వుంటే, రానున్న రెండేళ్ళలో ఉధృతంగా పార్టీ పరమైన కార్యక్రమాలు చేపట్టాలనీ, మంత్రులు మెరుపు పర్యటనలతో ప్రజల్లో వుండాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారట.
ఎక్కడెక్కడ బలహీనమవుతున్నామో, ఆయా చోట్ల పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలకు అధినేత వైఎస్ జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ సొంత సర్వేలోనే 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఔట్ అవుతారని తేలిందంటే, స్వతంత్ర సంస్థ ఏదన్నా సర్వే చేస్తే.. దానికి రెండింతలు.. ఆ పైన నష్టం కింది స్థాయిలో వైసీపీకి జరిగిపోయిందనే కదా అర్థం.?
16937 982066You need to be really astute at research and writing. This shows up in your original and distinctive content material. I agree along with your primary points on this subject. This content material really should be seen by a lot more readers. 266540
669322 279144I definitely did not comprehend that. Learnt one thing new today! Thanks for that. 235349