ఇదా రాజకీయం.? వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేస్తే, ‘గుండె పోటు’గా చిత్రీకరించేందుకు వైసీపీ పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. అది గుండె పోటు కాదు, హత్య.. అని బహిర్గతమైపోయాక, దాన్ని ‘నారాసుర రక్తచరిత్ర’గా మార్చేసింది వైసీపీ.!
ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. అంటే, జరుగుతున్న ఘోరాల్ని, నేరాల్ని, దుర్మార్గాల్నీ.. వైసీపీ తమదైన ప్రచారంతో పక్కదారి పట్టిస్తోంది. అంతర్వేది రధం దగ్ధమైతే, తేనెపట్టు కోసం కొందరు వ్యక్తులు చేసిన ప్రయత్నం వల్లే ఆ దుర్ఘటన జరిగిందని అధికారులు సైతం చెప్పే పరిస్థితి. చివరికి, దాన్ని తగలబెట్టిందెవరో అంతా మర్చిపోయేలా చేయగలిగారు.
‘వాళ్ళే తగలబెడతారు.. వాళ్ళే దేవాలయాల దగ్గర ఆ:దోళనలు చేస్తారు..’ అంటూ సాక్షాత్తూ వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విపక్ష నేతలపై దుమ్మెత్తిపోయడం చూశాం. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపైకి వైసీపీ గూండాలు దాడికి దిగితే, ‘మా కార్యకర్తలకు బీపీలు వస్తాయ్..’ అని చెప్పిన వైఎస్ జగన్, ‘ప్రజాస్వామ్యంలో దాడులకు చోటుండకూడదు..’ అని చెబుతుంటారు.. మొసలి కన్నీరు కార్చుతుంటారు.
ఇప్పటం గ్రామంలో అధికారులు అడ్డగోలుగా తమ ఇళ్ళను కూల్చేశారని బాధిత ప్రజలు గగ్గోలు పెడుతోంటే, ‘అబ్బే, ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే నోటీసులు వచ్చాయ్..’ అంటూ కొందరు పేటీఎం కార్యకర్తలతో వైసీపీ కథను కొత్తగా మార్చి చెబుతోంది.
ఆ మధ్య జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే, వాటిని సహజ మరణాలుగా తేల్చేసింది వైసీపీ సర్కార్. ఇదీ రాష్ట్రంలో జరుగుతున్న అసహజ రాజకీయం.! ఏం జరిగినా, ఎంత ఘోరం జరిగినా.. ఎంత పెద్ద నేరం జరిగినా, దాన్ని ‘బులుగు రాజకీయం’ ఏమార్చేయగలదని అధికార వైసీపీ అనుకుంటోంది.
దీన్ని రాజకీయం అనలేం.. ముమ్మాటికీ ఇది రాజకీయ ఉన్మాదమేనన్నది విపక్షాల విమర్శ.
212741 890753Totally composed content material material , Really enjoyed examining . 224317
11901 216296It was any exhilaration discovering your web site yesterday. I arrived here nowadays hunting new issues. I was not necessarily frustrated. Your tips soon after new approaches on this thing have been helpful plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 342900