మూడు రాజధానులకు సంబంధించిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో టీడీపీ అధినేత ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు కూడా. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఓ సందేశం చక్కర్లు కొడుతోంది. ‘మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబుతోపాటు 20 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తారు. శనివారం తమ రాజీనామాలను గవర్నర్ కి సమర్పిస్తారు. దీనికి సంబంధించి చంద్రబాబు.. తమ పార్టీ ఎమ్మెల్యేలకు కాల్ చేయనున్నారు’ అన్నది ఆ సందేశం సారాంశం.
ఇందులో ఎంత నిజముందో తెలియకుండానే పలు ఊహాగానాలు కూడా వచ్చేశాయి. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నారని.. ఇది సరైన వ్యూహం కాదని అభిప్రాయపడినట్టు వార్తలొచ్చాయి. చివరకు చంద్రబాబు రంగంలోకి దిగి అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారని తేలింది. మరోవైపు ఈ ప్రచారానికి కౌంటర్ గా మరో సందేశం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వైఎస్సార్ సీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన గుంటూరు, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని.. వారంతా ఇప్పటికే ఓ హోటల్ లో సమావేశమై మంతనాలు సాగిస్తున్నారని.. త్వరలోనే తమ పదవులకు రాజీనామా చేయబోతున్నారని దాని సారాంశం.
ఇలా టీడీపీ, వైసీపీలకు చెందిన వ్యక్తులు ఒకరిపై మరొకరు అసత్య ప్రచారానికి తెరతీసినట్టు తెలుస్తోంది. కాగా, మూడు రాజధానుల నిర్ణయంపై ఎన్నికలకు వెళ్లాలని, లేదా రిఫరెండం పెట్టాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. బాబుకు దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు అందరి చేతా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 20 సీట్లకు 20 గెలిస్తే వికేంద్రీకరణపై పునరాలోచన చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికిప్పుడు ఎవరూ కూడా రాజీనామా చేసే పరిస్థితి లేదన్నది మాత్రం నిర్వివాదాంశం.
723999 218317Soon after study a number of the websites with your web site now, and that i genuinely appreciate your method of blogging. I bookmarked it to my bookmark web site list and are checking back soon. Pls have a appear at my web page likewise and let me know if you agree. 182951
212424 763288It is difficult to get knowledgeable folks on this topic, but the truth is be understood as what happens youre preaching about! Thanks 209794