బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడ్డ ఆయన కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన శనివారం విజయవాడలో తుది శ్వాస విడిచారు. దాదాపు నెల రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఏలూరులోని కోవిడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు.
కొద్దిరోజులుగా ఆయన వెంటిలేటర్ పైనే చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. మాణిక్యాలరావు 2014లో పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా గెలుపొందారు. టీడీపీతో పొత్తు కారణంగా ఆయన్ను మంత్రి పదవి వరించింది. 2014 నుంచి 2018 వరకూ ఆయన ఏపీ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా కొనసాగారు. ఆయన వయసు 59 సంవత్సరాలు.
తాడేపల్లిగూడెంలో ఆయన ఫొటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవక్ గా ఉంటూ 1989లో బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు. ఆయన మృతిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మాణిక్యాలరావు మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాణిక్యాల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.
450584 998650Wohh just what I was searching for, appreciate it for putting up. 598874
11729 739017There is noticeably a whole lot to know about this. I believe you made some nice points in functions also. 718779
199036 103605Although you are any of the lucky enough choices, it comes evidently, while capture the fancy with the certain coveted by ly folks other beneficial you you meet may possibly possibly nicely have hard times this specific difficulty. pre owned awnings 741059