‘మేం గనుక అధికారంలోకి వచ్చాక ఐదేళ్ళలో మద్య నిషేధాన్ని అమలు చేయకపోతే ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోం..’ ఇది స్వయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో ఇచ్చిన హామీ. రాష్ట్రంలో దశల వారీ మద్య నియంత్రణ అన్నారు. మద్య నియంత్రణను గాలికొదిలేసి, యధేచ్ఛగా మద్యం విక్రయాల్ని ప్రోత్సహిస్తున్నారు. పైగా, చిత్ర విచిత్రమైన బ్రాండ్ల మద్యంతో జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు.
అసలు విషయంలోకి వస్తే, ‘ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల లోపే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం..’ అని అంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అసలు వైసీపీ పాలనలో మంత్రుల మాటలకు విలువ వుందా.? అన్నదే అసలు చర్చ. అసెంబ్లీ సాక్షిగా గతంలో మంత్రిగా పనిచేసిన వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పలు డెడ్లైన్లు పెట్టారు. ఏమయ్యింది పోలవరం ప్రాజెక్టు.?
ఇలాగే వుంటాయ్ మంత్రుల మాటలు. మాటలేమో కోటలు దాటేస్తాయ్.. చేతలేమో గడప కూడా దాటవ్. మూడు రాజధానులకు సంబంధించి చాలా లింకులున్నాయ్. అవి లాక్కోలేక పీక్కోలేక వైసీపీ సర్కారు కిందా మీదా పడుతున్న వైనాన్ని చూస్తున్నాం.
స్వయంగా వైసీపీ సర్కారే, మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుందాయె. మెరుగైన బిల్లు తీసుకొస్తాం.. అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించి రోజులు, నెలలు గడిచిపోతున్నాయ్. అసలంటూ బిల్లు పెట్టాలి, అది ఆమోదం పొందాలి.. ఆ తర్వాత న్యాయపరమైన వివాదాలేవీ రాకుండా వుండాలి. అవన్నీ జరగాలంటే, ముందుగా రాజధాని అమరావతిలో పనులు మొదలు కావాలి. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్ని ప్రభుత్వం మెప్పించగలగాలి.
మింగడానికకి మెతుకుల్లేవుగానీ.. మీసాలకు శంపంగె నూనె కావాలన్నాడట వెనకటికి ఒకడు. ఒక్క రాజధాని నిర్మాణానికే నిధులు లేవని వైసీపీ సర్కారు చెబుతోందాయె. అలాంటిది, మూడు రాజధానులెలా వైసీపీ సర్కారు నిర్మిస్తుంది.? ఆమాత్రం ఇంగితం లేకుండా వైసీపీ నేతలెలా మాట్లాడుతున్నారు.?
876382 656654But yet another intelligent weblog! Completely cannot wait for a lot more! 46885
215342 150946Totally indited content , Actually enjoyed looking at . 766071
211807 315314But, what concerning the conclusion? Are you sure in regards to the source? 127448