తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం జరిగింది. దాదాపుగా మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చించారు. పలు కీలక నిర్ణయాలను కేబినేట్ తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతల విషయం నుండి మొదలుకుని సెప్టెంబర్ 17వ తారీకున జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించాలంటూ నిర్ణయాలు తీసుకున్నారు.
ఒక వైపు కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం గా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రోజుల పాటు జాతియ సమైక్యతా దినోత్సవాల్లో భాగంగా వజ్రోత్సవాలను నిర్వహించాలంటూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తగ్గేది లేదు అన్నట్లుగా ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో పట్టుదలతో ఉంది. కేంద్ర మంత్రులు మరియు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారట.
13093 747407This will be a fantastic site, may well you be interested in performing an interview about how you developed it? If so e-mail me! 799144