తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్ పక్రియ ప్రారంభం అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే అక్కడ రాబోతున్నట్లుగా మొదటి రౌండ్ నుండే తేటతెల్లం అయ్యింది. వైకాపా స్పష్టమైన ఆధిక్యంను కనబర్చుతోంది. వైకాపా భారీ మెజార్టీ ని కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో అప్పుడే నిరాశ కనిపిస్తుంది. ఇప్పటికే కౌంటింగ్ హాల్ నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి వెళ్లి పోయారు.
వైకాపా నుండి డాక్టర్ గురుమూర్తి బరిలో ఉన్నాడు. ఆయన విజయం ఖాయం అంటూ మొదటి నుండి అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెజార్టీ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక తిరుపతిలో రెండవ స్థానం పై కూడా ఆసక్తి నెలకొంది. రెండవ స్థానంను బీజేపీ దక్కించుకుని పరువు నిలుపుకుంటుందా లేదంటే జనసేన పార్టీ మద్దతుతో బీజేపీ రెండవ స్థానంలో నిలుస్తుందా అనేది చూడాలి. మొత్తంగా తిరుపతి ఉప ఎన్నికల ట్రెండ్స్ చూస్తూ వైకాపా పుల్ జోష్ లో కనిపిస్తుంది.