తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఉప ఎన్నికకు సంబంధించి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశించాలని పనబాక పిటిషన్ వేశారు. తిరుపతి ఉప ఎన్నికను పూర్తిగా రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అభ్యర్ధించారు. వీరిద్దరూ వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం కీలక తీర్పునిచ్చింది. ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
‘ఎన్నికలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలు పెట్టారు. కానీ.. ఎలక్షన్ పిటిషన్కు అవకాశం ఉన్న సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోలేం’ అని తేల్చి చెప్పింది. ‘ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ వేసుకోండి’ అని సూచించింది. మే2న ఎలక్షన్ కౌంటింగ్ జరగబోతున్న తరుణంలో కోర్టు ఏం తీర్పునిస్తుందోనని రాజకీయ పార్టీల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి.. పనబాక, రత్నప్రభ ఎలా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.
232727 683290The the next occasion Someone said a weblog, Hopefully so it doesnt disappoint me approximately this. What im saying is, I know it was my choice to read, but I actually thought youd have something intriguing to express. All I hear is often a number of whining about something which you could fix in case you werent too busy looking for attention. 549508