Switch to English

టీడీపీ బాటలోనే వైసీపీ మునక.. తాడిని తన్నేవాడుంటే…

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

టీడీపీకి రాజీనామా చేసి, దాంతోపాటుగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌, వైసీపీలో చేరి.. ఇప్పుడు తాజాగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. మరి, ఈపాటి చిత్తశుద్ధి టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైసీపీ వైపు వెళ్ళిన ఎమ్మెల్యేలలో ఎందుకు కన్పించడంలేదు.? ఎమ్మెల్సీ పదవి అంటే, అదెలాగూ తనకే దక్కుతుంది గనుక.. డొక్కా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే పదవి అంటే అలా కాదు కదా. రాజీనామా చేస్తే, ఉప ఎన్నికలొస్తాయి. ఆయా ఎమ్మెల్యేలకు మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం లేకపోవడం ఇంకో ఎత్తు, ఆ స్థానాల్ని మళ్ళీ గెలుచుకోగలమా.? లేదా.? అన్న అధికార పార్టీ అనుమానాలు ఇంకో వైపు.. వెరసి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం సందిగ్ధంలో పడింది.

మరోపక్క, టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలను, టీడీపీ పైకి ఎగదోయడంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్రమైన గేమ్ ప్లాన్‌ని అమలు చేస్తోంది. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇలాగే జరిగింది. టీఆర్‌ఎస్‌ మీదకి, టీఆర్‌ఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలను ఎగదోశారు అప్పట్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఇక, వైసీపీ గేమ్ ప్లాన్‌లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేతని ఏ స్థాయిలో తిడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌తోనూ, జనసేనపై విమర్శలు చేయిస్తోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. మొదటి నుంచీ జనసేనలో రాపాక వ్యవహారశౖలి అనుమానాస్పదమే. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయన విషయంలో జనసేన పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. దాంతో, గట్టిగా జనసేనను తూలనాడేందుకు సంశయిస్తున్న రాపాక, కేవలం పొలిటికల్‌ సెటైర్లతోనే సరిపెడుతున్నారు.

అన్నట్టు, వైసీపీ ఆడుతోన్న ఈ హేయమైన పొలిటికల్‌ గేమ్.. వైసీపీకి కూడా పెద్ద షాకే ఇస్తోంది.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రూపంలో. రఘురామకృష్ణరాజు వైసీపీని వీడే ఉద్దేశ్యం లేదంటున్నారు. కానీ, వైసీపీలో ముసలం పుట్టించారు. వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డినే టార్గెట్‌ చేసుకున్నారు రఘురామకృష్ణరాజు. వైసీపీ ఎమ్మెల్యేల్ని ఇసుక దొంగలుగా అభివర్ణించారు ఈ నర్సాపురం ఎంపీ.

ఇంతా చేసి, ‘మా ముఖ్యమంత్రి చాలా మంచోడు.. ఆయనంటే నాకు వల్లమాలిన ప్రేమ..’ అంటున్నారు. ఇంతలోనే, ‘అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడుంది.? అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ..’ అని కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అవును, ఇప్పుడు వైసీపీ ఉనికికే ప్రమాదమొచ్చేలా వుంది నర్సాపురం ఎంపీ ప్రశ్నలతో.. అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందుకే మరి, తాడిని తన్నేవాడుంటే.. వాడి తలను తన్నేవాడూ వుంటాడనేది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...