క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘వేదం’ సినిమాలో నటించిన నాగయ్య అనారోగ్య కారణంగా మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నాగయ్య మృతి వార్తలను ఆయన కుటుంబ సభ్యులు దృవీకరించారు. నాగయ్య వేదం తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. రానా మొదటి సినిమా లీడర్ లో ఆయన చిన్న పాత్రలో కనిపించి ఎప్పటికి గుర్తు ఉండి పోయేలా నటించి మెప్పించాడు. అమాయకపు పేద రైతుగా లేదంటే వృద్దుడిగా చాలా సహజంగా నటించే నాగయ్య ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానించారు.
ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్నా నాగయ్యకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. చాలా సినిమాల్లో చేసినా కూడా అవి చిన్నా చితకా పాత్రలే అవ్వడం వల్ల ఆర్థికంగా నిలదొక్కకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. గుంటూరు జిల్లా నర్సరావు పేట కు సమీపంలో ఉండే దేసవరం అనే చిన్న గ్రామానికి చెందిన నాగయ్య పని చేసుకోవడం కోసం కొడుకులతో కలిసి హైదరాబాద్ వచ్చాడు. ఒక సారి రోడ్డు మీద నాగయ్యను చూసిన వేదం నిర్మాత సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. అప్పటి నుండి వేదం నాగయ్యగా మారిపోయాడు. వేదం, నాగవల్లి, ఒక్కడినే, లీడర్, రామయ్య వస్తావయ్యా, స్పైడర్తో పాటు ఇంకా పలు సినిమాల్లో నటించాడు. గత ఏడాది కూడా ఆయన ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. రోజుకు అయిదు నుండి పది వేల పారితోషికం తీసుకుని నాగయ్య నటించే వారు. ఆయన ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ సీఎం దృష్టికి వెళ్లడంతో పిన్షన్ ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. అలాగే లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా చేశారు. నాగయ్య మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
882941 87261Typically I dont read post on blogs, but I would like to say that this write-up very compelled me to try and do so! Your writing style has been amazed me. Thanks, very wonderful post. 627588
733895 938117hi and thanks regarding the certain post ive really been looking regarding this kind of info online for sum time these days hence thanks a whole lot 437792