Switch to English

వైసీపీకి డేంజర్‌ బెల్స్‌: ఇరకాటంలో సీఎం వైఎస్‌ జగన్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రారంభించి, తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్‌ పార్టీని ఎదిరించి, తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిపక్షంగా తలపడి, నిలబడ్డారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఆయన కష్ట ఫలించింది.. అధికార చేతికొచ్చింది. కానీ, ఇప్పుడు కథ అడ్డం తిరుగుతోంది. ఓ వైపు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలన, ఇంకో వైపు పార్టీ అధినేతగా చక్కబెట్టాల్సిన వ్యవహారాలతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

కీలకమైన అంశాలపై మీడియా ముందుకొచ్చేందుకు వైఎస్‌ జగన్‌ మొహమాటపడాల్సి వస్తోంది. నిజానికి, ఆయన మొహం చాటేస్తున్నారని అనడం సబబేమో. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి వ్యవహారాలపై వైఎస్‌ జగన్‌ పెదవి విప్పలేని పరిస్థితి ఏర్పడిందిప్పుడు. వైసీపీ – టీడీపీ మధ్య ‘ఆత్మకూరు’ రచ్చ చిన్నదేమీ కాదు. ఈ వ్యవహారంలో వైసీపీ ఇమేజ్‌ దారుణంగా డ్యామేజ్‌ అయిపోయింది.

అయినాగానీ, వైఎస్‌ జగన్‌, తన చుట్టూ వున్న ‘కోటరీ’ని దాటి, బయటకొచ్చి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది. దాదాపు అన్ని విషయాల్లోనూ ఇదే పరిస్థితి. పవర్‌ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంపై వైఎస్‌ జగన్‌ యూటర్న్‌ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. రేపో మాపో పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే పరిస్థితి రావొచ్చు. అమరావతి సంగతి సరే సరి.

ఎలా చూసినా, ఒకదాని వెంట ఇంకొకటి ఫెయిల్యూర్స్‌ని జగన్‌ని ఎదుర్కోక తప్పేలా లేదు. నిజానికి, తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు గనుక, వైఎస్‌ జగన్‌ కొంత సమయం తీసుకుని వుండాల్సింది వివాదాస్పద నిర్ణయాల విషయంలో. ఓ ఆరు నెలలపాటు రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేసి, ఈలోగా సంక్షేమ పథకాల పేరుతో తమకు చెడ్డపేరు రాకుండా చూసుకోగలిగితే.. పరిస్థితి ఇంకోలా వుండేది.

చంద్రబాబు చుట్టూ ఎప్పుడూ ఓ కోటరీ వుంటుంది. దాన్ని దాటి ఆయన బయటకు రారు. అదే ఆయన్ని ఎప్పటికప్పుడు ముంచేస్తుంటుంది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ కూడా అదే ఫాలో అవుతున్నట్లున్నారు. చంద్రబాబు పరిస్థితి వేరు, వైఎస్‌ జగన్‌ పరిస్థితి వేరు. ముందు ముందు రాజకీయంగా వైఎస్‌ జగన్‌ మరింత క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు.

ప్రభుత్వంలోనే ‘నిక్కచ్చిగా మాట్లాడేవారు’ వుండడం కూడా వైఎస్‌ జగన్‌కి అవసరమే. కానీ, సొంత మీడియా కావొచ్చు.. పార్టీలో ముఖ్యమైన నేతలు కావొచ్చు.. భజన బృందంలా మారిపోవడంతోపాటుగా, వైఫల్యాల్ని కూడా గమనించలేనంతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అడ్డుపడుతున్నారు. ఇలాగైతే, రాష్ట్రంలో పాలన పడకేయడమే కాదు.. పార్టీ కూడా పడకేసేలా వుందన్నది నిర్వివాదాంశం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...