వైఎస్సార్ విగ్రహాన్ని టచ్ చేసే దమ్మెవడికైనా వుందా.? అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు, మీడియా వేదికగా కొందరు వైసీపీ నేతలు.. ‘బస్తీ మే సవాల్’ అన్నారు. ప్చ్.. ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించేశారు. ఆ విగ్రహం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘మందిరం’ లాంటి నిర్మాణాన్నీ కూల్చేశారు.
రోడ్ల మీద రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడం అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది. రోడ్లకు అడ్డంగా రాజకీయ నాయకుల విగ్రహాలేంటి బుద్ధి లేకపోతే.. అంటూ చాలా సార్లు చాలా రకాలుగా చర్చోపచర్చలు జరిగాయి, జరుగుతూనే వున్నాయి. కానీ, అదో పైత్యం.. దాన్ని ఎవరూ ఆపలేరు.
మహనీయుల విగ్రహాల్నయినా సరే ఎడా పెడా అడ్డగోలుగా ఏర్పాటు చేసేస్తే.. వాటి వల్ల ఆయా మహానుభావులకు అదనంగా దొరికే గౌరవం ఏమీ వుండదు సరికదా.. పిచ్చి పీక్స్కి వెళితే కొందరు వాటిని ధ్వంసం చేసేస్తుంటారు.. ఈ క్రమంలో కులాల మధ్యా, మతాల మధ్యా, రాజకీయ పార్టీల మధ్యా గొడవలు జరిగి, రక్తపాతం చోటు చేసుకుంటుంటుంది.
సరే, ఆ సంగతి పక్కన పెడదాం. ఇప్పటం గ్రామంలో రోడ్ల వెడల్పు పేరుతో వైసీపీ విధ్వంస రాజకీయానికి తెరలేపింది. కొందరి ఇళ్ళను టార్గెట్ చేస్తూ ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం షురూ అయ్యిందన్నది ప్రధాన ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే ఆ కొందరి ఇళ్ళను ధ్వంసం చేసేసి, వైఎస్సార్ విగ్రహాల మీద ఈగ వాలకుండా, వాటికి ప్రత్యేకంగా కంచె వేయించింది వైసీపీ సర్కారు.
కానీ, సర్వత్రా వెల్లువెత్తిన విమర్శలు, ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవడం వెరసి.. అధికార వైసీపీ దిగిరాక తప్పలేదు. జాగ్రత్తగా వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించేశారు. అది కూడా, ఇప్పటం గ్రామంలో ఇళ్ళ ధ్వంసం కారణంగా బాధితులైనవారికి జనసేన అధినేత లక్ష రూపాయల చొప్పున విరాళం ప్రకటించాక.
దెబ్బకి దెయ్యం దిగొచ్చిందంటారు కదా.. అలాగే ఇది కూడానూ.. అంటోంది జనసేన.
83515 124420Glad to be 1 of several visitants on this awful internet site : D. 730835
905776 409I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 500608