వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాల్లో పేదలందరికీ సొంతిళ్ళు.. అనేది ఒకటి. ఇందుకోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా భూమిని సేకరించారు, సమీకరించారు. ఈ క్రమంలో చాలా వివాదాల్నే ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదో పెద్ద స్కాం..అని విపక్షాలు విమర్శించాయి కూడా. ముందస్తుగా భూముల్ని తమ పార్టీకి చెందినవారితో తక్కువ ధరకు కొనిపించి, వాటికి ప్రభుత్వం తరఫున అధికంగా చెల్లింపులు చేసిందన్న విమర్శలున్నాయి.
ఆ సంగతి పక్కన పెడితే, స్మశానాల్లోనూ, ముంపు ప్రాంతాల్లోనూ భూముల్ని పేదల కోసం కేటాయించారన్న వాదనలూ లేకపోలేదు. ఎలాగైతేనేం, పేదలకు ఇళ్ళ స్థలాలకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమం నానా వివాదాల నడుమ ఓ కొలక్కి వచ్చింది.. లబ్దిదారుల్లో చాలామందికి ఇళ్ళ పట్టాలు అందాయి కూడా. వాటిల్లో నేటి నుంచి ఇళ్ళ నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రభుత్వమే ఇళ్ళు కట్టించేలా, ఆయా కాలనీలకు సకల సౌకర్యాలూ కల్పించేలా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నిజానికి, గొప్ప ఆలోచనే ఇది. కానీ, ఆచరణలోనే చాలా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రధానంగా ముంపు సమస్య.. అనేది లబ్దిదారులకు ఇబ్బందిగా మారింది. పీకల్లోతు మునిగిపోయే పరిస్థితి వుంది కొన్ని చోట్ల. మరి, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ముంపు సమస్య లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతోందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. రానున్నది వానాకాలం. ఇళ్ళ నిర్మాణ పనులేమో నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ముఖ్యమంత్రి కాస్సేపట్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. గట్టిగా వర్షాలు కురిసినా, ఓ మోస్తరుగా వర్షాలు కురిసినా.. ప్రభుత్వానికి అది తలనొప్పిగా మారుతుంది. మరి, ఈ వాన గండం నుంచి జగన్ సర్కార్ ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాలి.
552779 40477Likely to commence a business venture about the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects much more via the www often. earn cash 859752