YS Sharmila: అన్న వదిలిన బాణం.. ఇప్పుడు చెల్లెలే బాణమై అన్నకు దూసుకొస్తోంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సీఎం జగన్ (CM Jagan) నిర్ణయాలను తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని.. ఐకనిక్ టవర్ నిర్మిస్తామనే ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శించారు షర్మిల.
‘పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్’.
‘రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం,భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా?’ అని అన్నారు.
పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?
పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం…— YS Sharmila (@realyssharmila) March 6, 2024