అమరావతి పరిరక్షణ సమితి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. పాదయాత్ర ప్రస్తుతానికి సజావుగా సాగుతోంది. సహజంగానే ఈ పాదయాత్ర అధికార పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోంది.
నిజానికి, ఎలాగైనా పాదయాత్రకు మోకాలడ్డాలని అధికార పార్టీ అడ్డగోలు ఎత్తుగడలు వేసినా, కోర్టుకు వెళ్ళి అమరావతి పరిరక్షణ సమితి, మహా పాదయాత్రకు అనుమతులు పొందిన విషయం విదితమే. అయినా, అధికార పార్టీ అక్కసు చల్లారడంలేదు.
‘అమరావతి పరిరక్షణ సమితి చేస్తోన్న మహా పాదయాత్ర కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగితే, చంద్రబాబుదే బాధ్యత..’ అంటూ అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నదెవరు.?
2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చినా, ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు ఇంకా టీడీపీనే అధికారంలో వుందనే భావనలో వున్నట్టున్నారు. లేకపోతే, అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్ర చేస్తే, ఆ పాదయాత్రకి ఎవరో అడ్డుతగలితే (ఇంకెవరు, వైసీపీ మద్దతుదారులే అవుతారు) దానికి చంద్రబాబు బాధ్యత వహించడమేంటి.?
నిజమే, చంద్రబాబు గనుక ముఖ్యమంత్రి పదవిలో వుంటే.. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానికి ఆయనే నైతిక బాధ్యత వహించాలి. ఆ లెక్క, వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపణలు చూస్తోంటే, ఇప్పుడు అధికారంలో వున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాదు.. చంద్రబాబు అనే భావన కలగడం సహజమే.
టీడీపీ, అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచింది. బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వామపక్షాలు సైతం అమరావతికి మద్దతు పలికాయి. వాస్తవానికి అమరావతికి అసెంబ్లీ సాక్షిగా గతంలో వైసీపీ కూడా మద్దతు పలికింది. వైసీపీ మాట తప్పినట్లు, మడమ తిప్పేసినట్లు.. అందరూ తిప్పేస్తారని, తిప్పేయాలని అనుకుంటే ఎలా.?
215629 572062You made some decent points there. I looked on the internet for the issue and identified most individuals will go along with along with your site. 866699
537235 441962Precisely what I was looking for, thankyou for putting up. 349689
188383 685962I believe this is among the most vital info for me. And im glad reading your post. But wanna remark on few common points, The web site style is perfect, the articles is truly great : D. Good job, cheers 524554