గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా సోకడం ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. గతంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి కరోనాపై అవగాహన పెంచారు. ఆ సమయంలో ఆయనకు కరోనా సోకింది. అయితే.. ఆ సమయంలో ఆయన కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ వైరస్ బారిన పడినట్టు ఆయన స్వయంగా తెలిపారు.
ముస్తఫా బంధువకు కరోనా సోకడంతో మొత్తం కుటుంబానికి కరోనా పరీక్షలు చేశారు. ఈక్రమంలో ముస్తఫాకు స్వల్ప లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ముస్తఫా హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు వెయ్యికి పైగా కరోనా యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 1184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క ప్రజలందరూ మాస్కులు వినియోగించాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది.
53930 199510Normally I dont learn post on blogs, however I wish to say that this write-up extremely pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite fantastic article. 86555
878097 858152Shame on the search Google for now not positioning this put up higher! Come on over and discuss with my site. 205854
401356 719304I like this web site because so significantly helpful stuff on here : D. 834231