ప్రజలకు ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలు అందించాలని వలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దిశ చట్టం కూడా తీసుకొచ్చింది. అయితే దిశ చట్టానికి భయపడకుండా.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థకు మచ్చ తెస్తున్నారు కొందరు వైసీపీ నేతలు. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
గతంలో కౌన్సిలర్ గా పని చేసిన కాటయ్య.. ప్రస్తుతం వైసీపీ నేతగా ఉన్నాడు. పెళ్లై పిల్లలున్న కూతురు వరుసయ్యే యువతిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఫోన్లో, వాట్సాప్ మెసేజెస్ చేస్తూ వేధించాడు. ఏకంగా.. బాబాయ్ అని పిలవొద్దు.. నువ్వంటే ఇష్టం అంటూ అతడి వేధింపులు పెరిగిపోయాయి. ఇది సరికాదని వేడుకున్నా కోరిక తీర్చాల్సిందేనంటూ వేధించాడు. ఇక తన ఆగడాలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. ఈమెతోపాటు మరికొందరిని కూడా కాటయ్య వేధించాడు. వీరంతా పోలీసులను ఆశ్రయించి కాటయ్య వాయిస్ రికార్డులను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. విశేషమేంటంటే.. కాటయ్య వేధింపులను అతడి భార్యకు వినిపిస్తే.. వాయిస్ ఎందుకు రికార్డ్ చేశావంటూ కాటయ్యనే సపోర్ట్ చేయడం ఆమెను ఆశ్చర్యపరచింది.
కాటయ్య ఆగడాలు కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా జరిగాయని సుళ్లూరుపేట అతడి గురించి తెలిసిన ప్రజలు అంటున్నారు. తోటి మహిళా కౌన్సిలర్లను ఇదే తరహాలో లైంగికంగా వేధించేవాడని అంటున్నారు. కాటయ్యను కఠినంగా శిక్షించాల్సిందే అంటున్నారు. మరి.. వైసీపీ నేతగా ఉన్న కాటయ్యపై మహిళా కమిషన్, ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
363479 847551No more s . All posts of this qaulity from now on 621830
811411 160716Hello! Excellent stuff, please keep us posted when you post once again something like that! 858866