Switch to English

అధికార పీఠం అప్పగించేది అతివలే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,409FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇక మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో గడువు ముగియనుంది. సభలు, సమావేశాలు, నేతల హామీలు, విమర్శలు, ప్రతివిమర్శలకు 9వ తేదీ సాయంత్రంతో తెరపడనుంది. గురువారం జరిగే పోలింగ్ లో ఓటర్లు ఏ పార్టీని గద్దెనెక్కించాలో, ఏ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేయాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో తమ తీర్పును నిక్షిప్తం చేస్తారు. తర్వాత మే 23న ఫలితాలు వెల్లడయ్యే వరకు అధికారం ఎవరిది అనే అంశంపై ఉత్కంఠ తప్పదు.

ఇదంతా అలా పక్కన పెడితే.. ఈ సారి ఎంత మంది ఓటర్లు నేతల భవితవ్యాన్ని నిర్దేశించబోతున్నారు? ఏ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు వంటి వివరాలు పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈసారి నేతల భవితవ్యం మహిళా శక్తి చేతిలోనే ఉంది. అధికార పీఠాన్ని ఎవరికి అప్పగించాలనే విషయం అతివలే నిర్ణయించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉండటం ఇందుకు నిదర్శనం. రెండు జిల్లాల్లో మినహా మిగిలిన 11 జిల్లాల్లో అతివల ఓట్లే అధికం. గతనెల 25 నాటికి ఉన్న ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,94,62,339 మంది పురుషులు, 1,98,77,421 మంది మహిళలు, 3,957 మంది ఇతరులు (థర్డ్ జెండర్) ఉన్నారు. మొత్తమ్మీద 4,15,082 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.

శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మినహా మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 21,75,176 మంది ఓటర్లు ఉండగా.. 10,88,410 మంది పురుషులు 10,86,493 మంది మహిళలు, 273 మంది ఇతరులు ఉన్నారు. ఇక అనంతపురం జిల్లా విషయానికొస్తే.. 32,39,517 మంది ఓటర్లలో 16,25,192 మంది పురుషులు, 16,14,071 మంది మహిళలు, 254 మంది ఇతరులు ఉన్నారు. ఈ రెండు జిల్లాలూ మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో మహిళలనే ప్రభావం చూపనున్నారు. అంటే ఈసారి ఎవరిని గద్దెనిక్కించాలనే అంశం అతివల చేతిలోనే ఉందన్నమాట.

ఈ నేపథ్యంలోనే పార్టీలు రైతులతోపాటు మహిళలపై ప్రత్యేక దృష్టి సారించాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు పలు హామీలు గుప్పిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు-కుంకుమ పథకం కింద డబ్బులు వేస్తుండగా, మళ్లీ అధికారంలోకి వస్తే కోటి మంది మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తానని హామీ ఇచ్చారు.

ఇక వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మహిళలను ఆకట్టుకునే పథకాలు ప్రకటించారు. తమ పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏడాదికి రూ.15 వేల మొత్తం ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలు మొత్తం మాఫీ చేస్తామన్నారు. అంతేకాకుండా సున్నా శాతం వడ్డీకే మళ్లీ రుణాలిస్తామని ప్రకటించారు. మరి ఈ ఎన్నికల్లో మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఎవరిని గద్దెనెక్కిస్తారు? చంద్రబాబుకు బాసటగా నిలుస్తారా? లేక జగన్ పథకాలకు జైకొడతారా అనేది తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mouni Roy: మౌని బికినీ వేస్తే.. మత్తెక్కిస్తున్న ముంబై భామ అందాలు

Mouni Roy: ‘పాప అలా నడుస్తూ ఉంటే.. పాప అలా సింపుల్ గా నుంచుంటే.. అబ్బో..’ అని ఓ సినిమాలో హీరోయిన్ ను ఉద్దేశించి డైలాగ్...

Navdeep: ‘నా పేరు లేదని కొందరు బాధ పడుంటారు..’ రేవ్ పార్టీపై...

Navdeep: ‘బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rev Party) వ్యవహారంలో నా పేరు రాకపోవడంపై చాలామంది నిరుత్సాహపడి ఉంటార’ని హీరో నవదీప్ (Navdeep) అన్నారు. తాను...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన...

Indian 2: ఒకే వేదికపై చిరు, రజినీ, కమల్, చరణ్..! కిక్కెక్కిస్తున్న...

Indian 2: కొత్త సినిమాల ప్రమోషన్లకు ముఖ్య అతిథులుగా అతిరధ మహారధులు హాజరయితే ప్రేక్షకాభిమానులకు కన్నులపండగే. అరుదుగా జరిగే ఇటువంటి అంగరంగ వైభవం త్వరలో జరుగనుందని...

Bala Krishna: ‘ఆ లోటు ఈ వేడుక తీర్చింది’.. సత్యభామ ప్రీ-రిలీజ్...

Bala Krishna: ‘ఎన్నికలయ్యాక ఫుల్ జోష్ తో షూటింగ్స్ చేద్దామనుకున్నా.. ఇప్పటికీ మొదలు పెట్టలేదు. దాదాపు 50రోజులు మిస్సయిన కెమెరాను సత్యభామ వేడుక భర్తీ చేసింద’ని...

రాజకీయం

టీడీపీ రిగ్గింగ్ వర్సెస్.! వైసీపీ రౌడీయిజమ్.!

ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడులో తలలు పగిలాయ్.! రాయలసీమలోనూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏడు చోట్ల ఈవీఎంలను పగలగొట్టారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

సీఎం పదవీ ప్రమాణ స్వీకారం.! వైసీపీ అను‘కుల’ మీడియా వంటకాలు.!

ప్రస్తుతానికైతే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! కానీ, ఎన్నికల కోడ్ అమల్లో వుంది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత ఈక్వేషన్స్ మారతాయ్. మళ్ళీ వైఎస్ జగన్...

పవన్ కళ్యాణ్‌ని ఉద్దానం మర్చిపోలేదు.!

ఆంధ్ర రాష్ట్రం లో బాగా వెనక్కి నెట్టేయబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర. ఆ ఉద్దానం కిడ్నీ బాధితులతో దశాబ్దాలుగా విలవిల్లాడుతోంది. అంతు చిక్కని కిడ్నీ వ్యాధులతో ఉద్దానం చితికిపోయిందన్నది నిర్వివాదాంశం. దశాబ్దాలుగా ఈ సమస్యకు...

గ్రౌండ్ రిపోర్ట్: ఉత్తరాంధ్రలో ‘కూటమి’ వైపే మొగ్గు.!

రాయలసీమ తర్వాత, ఉత్తరాంధ్రలోనూ వైసీపీ అంతే బలంగా వుంటుందంటూ రకరకాల సర్వేలు చూస్తూ వచ్చాం. ఇంతకీ, పోలింగ్ తర్వాత ఉత్తరాంధ్రలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి.? ఉత్తరాంధ్రలోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇంకాస్త భిన్నం....

ఎక్కువ చదివినవి

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 26 మే 2024

పంచాంగం తేదీ 26- 05-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ తదియ సా.5.48 వరకు తదుపరి చవితి నక్షత్రం: మూల...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

ఇన్‌సైడ్ స్టోరీ: రాయలసీమలో వైసీపీ పరిస్థితేంటి.?

రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వేవ్ వున్నాగానీ, రాయలసీమలో మాత్రం షరామామూలుగానే వైసీపీ వేవ్ వుంటుందని, వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. రాయలసీమలో మెజార్టీ సీట్లు కొట్టగలిగితే, చాలా తేలిగ్గా ప్రభుత్వాన్ని ఇంకోసారి ఏర్పాటు...

Kalki 2898 AD: ‘ఇంజనీరింగ్ అద్భుతం ఇది..’ బుజ్జిని డ్రైవ్ చేసిన నాగచైతన్య

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) నటించిన భారీ స్కేల్ మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది....