ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇక మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో గడువు ముగియనుంది. సభలు, సమావేశాలు, నేతల హామీలు, విమర్శలు, ప్రతివిమర్శలకు 9వ తేదీ సాయంత్రంతో తెరపడనుంది. గురువారం జరిగే పోలింగ్ లో ఓటర్లు ఏ పార్టీని గద్దెనెక్కించాలో, ఏ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేయాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో తమ తీర్పును నిక్షిప్తం చేస్తారు. తర్వాత మే 23న ఫలితాలు వెల్లడయ్యే వరకు అధికారం ఎవరిది అనే అంశంపై ఉత్కంఠ తప్పదు.
ఇదంతా అలా పక్కన పెడితే.. ఈ సారి ఎంత మంది ఓటర్లు నేతల భవితవ్యాన్ని నిర్దేశించబోతున్నారు? ఏ నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు వంటి వివరాలు పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఈసారి నేతల భవితవ్యం మహిళా శక్తి చేతిలోనే ఉంది. అధికార పీఠాన్ని ఎవరికి అప్పగించాలనే విషయం అతివలే నిర్ణయించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉండటం ఇందుకు నిదర్శనం. రెండు జిల్లాల్లో మినహా మిగిలిన 11 జిల్లాల్లో అతివల ఓట్లే అధికం. గతనెల 25 నాటికి ఉన్న ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,94,62,339 మంది పురుషులు, 1,98,77,421 మంది మహిళలు, 3,957 మంది ఇతరులు (థర్డ్ జెండర్) ఉన్నారు. మొత్తమ్మీద 4,15,082 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు.
శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మినహా మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 21,75,176 మంది ఓటర్లు ఉండగా.. 10,88,410 మంది పురుషులు 10,86,493 మంది మహిళలు, 273 మంది ఇతరులు ఉన్నారు. ఇక అనంతపురం జిల్లా విషయానికొస్తే.. 32,39,517 మంది ఓటర్లలో 16,25,192 మంది పురుషులు, 16,14,071 మంది మహిళలు, 254 మంది ఇతరులు ఉన్నారు. ఈ రెండు జిల్లాలూ మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో మహిళలనే ప్రభావం చూపనున్నారు. అంటే ఈసారి ఎవరిని గద్దెనిక్కించాలనే అంశం అతివల చేతిలోనే ఉందన్నమాట.
ఈ నేపథ్యంలోనే పార్టీలు రైతులతోపాటు మహిళలపై ప్రత్యేక దృష్టి సారించాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు పలు హామీలు గుప్పిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు-కుంకుమ పథకం కింద డబ్బులు వేస్తుండగా, మళ్లీ అధికారంలోకి వస్తే కోటి మంది మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తానని హామీ ఇచ్చారు.
ఇక వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మహిళలను ఆకట్టుకునే పథకాలు ప్రకటించారు. తమ పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏడాదికి రూ.15 వేల మొత్తం ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలు మొత్తం మాఫీ చేస్తామన్నారు. అంతేకాకుండా సున్నా శాతం వడ్డీకే మళ్లీ రుణాలిస్తామని ప్రకటించారు. మరి ఈ ఎన్నికల్లో మహిళలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఎవరిని గద్దెనెక్కిస్తారు? చంద్రబాబుకు బాసటగా నిలుస్తారా? లేక జగన్ పథకాలకు జైకొడతారా అనేది తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.
456571 826181Enjoyed reading this, extremely great stuff, thankyou . 749954
660257 293125I discovered your weblog site on google and check some of your early posts. Proceed to maintain up the exceptional operate. I just extra up your RSS feed to my MSN News Reader. In search of ahead to studying extra from you in a even though! 714826
606522 297917This really is 1 extremely intriguing post. I like the way you write and I will bookmark your blog to my favorites. 168682
229889 536625As I web-site possessor I believe the content material here is rattling magnificent , appreciate it for your hard work. You should keep it up forever! Good Luck. 147569