నేపాల్ కు చెందిన 22 ఏళ్ల యువతి 2018లో లఖ్నవూలోని తన స్నేహితురాలి వద్దకు వచ్చింది. అప్పుడే ఆమెకు ప్రవీణ్ రాజ్ పాల్ పరిచయం అయ్యాడు. ఇద్దరు స్నేహంగా మెలిగారు. కొన్నాళ్ల తర్వాత ప్రవీణ్ ఆమెను మోసం చేసి ఒక పార్టీకి తీసుకు వెళ్లి అక్కడ డ్రగ్స్ కలిపిన డ్రింక్స్ ఇచ్చాడు. ఆ సమయంలో మత్తులో ఉండగా తనపై అఘాయిత్యం చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసే ఆమె ఫొటోలు మరియు వీడియోలు బయట పెడతానంటూ బయపెట్టడంతో 800 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర నాగపూర్లో ఉన్న తన మరో స్నేహితురాలి వద్దకు వెళ్లి అక్కడ ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
ఆమె ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు ఆమెను వెంట పెట్టుకుని లఖ్నవూకు వెళ్లారు. అక్కడ ప్రవీణ్ రాజ్ పాల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అతడిని విచారించి కేసును కోర్టకు తీసుకు వెళ్లబోతున్నారు. రేప్ కేసుతో పాటు చీటింగ్ కేసును కూడా అతడిపై నమోదు చేసే అవకాశం ఉంది.
అతడి వద్ద ఉన్న ఫొటోలు మరియు వీడియోలను స్వాదీనం చేసుకునే అవకాశం ఉంది. 800 కిలో మీటర్లు ప్రయాణించి తమ వద్దకు న్యాయం కోసం వచ్చిన ఆమెకు మద్దతుగా నిలుస్తాం అంటూ పోలీసులు హామీ ఇచ్చారు.
317800 481167As I web web site possessor I believe the content matter here is rattling magnificent , appreciate it for your hard function. You should keep it up forever! Greatest of luck. 848488