జనసేన పార్టీకి చెందిన ట్విట్టర్ అక్కౌంట్లు సస్పెండ్ కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగానే ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారాయన. ఆ పోస్ట్లో, ‘అభాగ్యుల తరఫున గొంతు కలిపేందుకు ప్రయత్నించడమే నేరమా.?’ అని నేరుగా ట్విట్టర్ సంస్థనే ప్రశ్నించారు జనసేనాని. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ సోషల్ మీడియా వింగ్స్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి.
ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ వాయిస్ని సోషల్ మీడియా వేదికగా విన్పించేందుకు జనసేన పార్టీ కూడా ఓ వింగ్ని ఏర్పాటు చేసుకుంది. అక్కౌంట్స్ నిలిపివేత మరీ అంత దారుణమైన విషయమేమీ కాదు. సస్పెన్షన్ని ఎత్తివేసే అవకాశాలుంటాయి. కానీ, కీలకమైన సమయంలో అక్కౌంట్లు సస్పెండ్ అవడం చాలా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ విషయమై జనసేన సోషల్ మీడియా టీమ్, ట్విట్టర్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ‘అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాం..’ అని జనసేన పార్టీ చెబుతోంది.
వ్యక్తిగతంగా పలువురు జనసైనికులు ట్విట్టర్ అకౌంట్ ఖాతాల్ని కోల్పోయారు. అయితే, ఆ వివరాలు మాత్రం పెద్దగా బయటకు పొక్కడంలేదు. జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్యమైన ఖాతాలే సుమారు 400 వరకు సస్పెండ్ అయ్యాయంటే, జనసైనికుల వ్యక్తిగత అక్కౌంట్లు కలిపాక.. ఆ సంఖ్య అనూహ్యంగా వుంటుందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘న్యాయ పోరాటం వరకూ అవసరం లేదు. సోషల్ మీడియా విభాగం సంప్రదింపులు జరుపుతోంది.. పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నాం..’ అని జనసేన పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత వవ్యాఖ్యానించడం గమనార్హం.
ఒక్కటి మాత్రం నిజం.. జనసేన పార్టీ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ అవడంతోనే, కొన్ని రాజకీయ శక్తులు కుట్రపన్ని అక్కౌంట్లను బ్లాక్ చేయించాయి. ఆ సంగతి పక్కన పెడితే, పవన్ మరోసారి జనసైనికులు సోషల్ మీడియా వేదికగా హద్దులు మీరకుండా (జుగుప్సాకరమైన పోస్టింగ్స్ చేయకుండా) వుండేలా ఆదేశాలు ఇవ్వడం ఉత్తమం.
340515 202674Really very best individuals messages are meant to charm allow honor toward groom and bride. Newbie speakers in front of excessive locations need to generally our own gold colored dominate in presenting and public speaking, which is to be private interests home. finest man speach 680822