జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ తో చేతులు కలిపాక అనేక దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఆంద్రప్రదేశ్ లో బీజేపీ తో కలిసి ఎలా అడుగులు వేయాలి ఎలా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విషయాలను గురించి పవన్ కళ్యాణ్ బీజేపీ లు సమాలోచన చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ అన్ని విధాలుగా ప్రజలకు అండగా ఉండేందుకు సిద్ధం అయింది. ఆంద్రప్రదేశ్ లో వైకాపా కు ప్రజలు పట్టంగడితే, ఆ పార్టీ ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉంటున్నాయి.
మొదటి ఆరు నెలలు పర్వలేదనిపించిన పార్టీ ఇప్పుడు దారుణంగా ఫెయిల్ అయ్యింది. మూడు రాజధానులు అంశంతో ప్రజలు క్రమంగా దూరం అవుతున్నాడు. ఇప్పుడు మండలి రద్దుకు ఉపక్రమించి రాజకీయంగా మరింత అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. ఇవే ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి. ముఖ్యంగా జనసేన బీజేపీ ఈ సమస్యలను అనుకూలంగా మార్చుకొని ప్రజల తరపున పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నది.
పవన్ కేవలం ఆంద్రప్రదేశ్ మీదనే కాకుండా తెలంగాణపై కూడా దృష్టి సారించినట్టుగా అర్ధం అవుతుంది. తెలంగాణ లో జనసేన పార్టీకి పెద్దగా పట్టులేదు . అయితే బీజేపీ తో పొత్తు ఉండటం కొంతవరకు కలిసివచ్చే అంశం. తెరాస పార్టీ సెంటిమెంట్ తో బలంగా పాతుకుపోయింది. కేంద్రంలోని బీజేపీ తో ఢీ అంటే ఢీ అంటూ యుద్ధానికి సిద్ధం అవుతున్న తరుణంలో తెలంగాణలో బీజేపీ తరపున పవన్ కూడా పోరాటం చేసేందుకు రెడి అవుతున్నారు.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చాలా వరకు సత్తా చాటింది. చాలా వార్డుల్లో, డివిజల్లో సత్తా చాటింది. మెరుగైన ఫలితాలు రాబట్టింది. రాబోయే కాలంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా ఫలితాలు సాధిస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. రాజకీయంగా పవన్ కూడా అక్కడ మంచి ఫలితాలు సాధించేందుకు బీజేపీ కి సహాయ సహకారాలు అందిస్తారని ఆ పార్టీ భావిస్తోంది.
923200 821941You developed some decent points there. I looked on the net for any difficulty and located most individuals goes along with together along with your internet site. 407735