వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పక్కర్లేదు. మూడు రాజధానులు అంటే వినడానికి బాగానే ఉంటుంది. కానీ చేతల దగ్గరికి వచ్చే సరికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో అందరికి తెలుసు. ఇబ్బందుల నుంచి బయటపడటం అంటే అంత తేలికైన విషయం కా దు అన్నది వాస్తవం.
ఇప్పటికే రాష్టానికి పుట్టెడు అప్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ. 700 కోట్లు వడ్డీ కడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఇంత మొత్తంలో వడ్డీలు కడుతున్న ప్రభుత్వం ఎందుకు మరలా ఇప్పుడు తిప్పలు తెచ్చుకుంటుందో తెలియడం లేదు. ఒక్క రాజధాని అంశమే మహా భారంగా మారిన ఈ రోజుల్లో మూడు రాజధానులు అంటే మహా కష్టం. మూడు ప్రాంతాలకు ప్రజలు తిరగాలి అన్నా, మూడు రాజధానుల్లో మంత్రులు ఉండాలి అన్నా చాలా కష్టమైపోతుంది.
దీనికి తోడు ఇప్పుడు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మండలి రద్దు ఫలితంగా ఇబ్బందులు వస్తాయని ప్రభిత్వానికి మచ్చ ఏర్పడుతుందని అంటున్నారు ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పైగా మండలి వలన ఉపయోగం లేదని స్పష్టంగా చెప్తోంది.
మండలి వలన రోజుకు కోటి వరకు ఖర్చు అవుతున్నట్టు చెప్తోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి మండలిని తీసుకురావాల్సిన అవసరం గురించి, బిల్లుల పై చర్చించే అంశాల గురించి ఆయన పలుమార్లు చట్టసభల్లో పేర్కొన్నారు. ఇప్పుడు అదే మండలిని ఆయన తనయుడు తప్పుపడుతూ రద్దుకు ప్రతిపాదించారు.
దీనిని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నది. బిల్లును అడ్డుకున్నందుకే కాముండా, సభలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని రద్దుకు తీర్మానం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బిసి, ఎస్సీ,ఎస్టీ వర్గీయులు ఎక్కువగా ఉన్న మండలిని రద్దు చేయడం అంటే వారిని వ్యతిరేకించినట్టే అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవే ప్రధాన అస్త్రాలుగా మారబోతున్నాయి. ప్రతిపక్షాలు అన్ని కలిసి ఈ విషయంలో పోరాటం చేస్తే వైకాపా దూకుడు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే పార్టీల కంటే కూడా ప్రజలే అధికంగా నష్టపోతారు.
207455 213748Fascinating point of view. Im curious to believe what type of impact this would have globally? Sometimes people get just a little upset with global expansion. Ill be about soon to have a look at your response. 786567