Switch to English

రాజధానిగా విశాఖ: వైసీపీ ఒప్పందం ఎవరితో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నంని రాష్ట్రంలోని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఖరారు చేసిందనీ, దీన్ని ఎవరూ ఆపలేరని వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి కుండబద్దలుగొట్టేశారు. ‘విశాఖ రాజధాని విషయమై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడాం..’ అంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ‘ఏకైక రాజధాని అమరావతి మాత్రమే’ అంటున్నారు. ఇప్పటిదాకా బీజేపీలోని వైసీపీ వర్గం నేతలుగా ముద్రపడ్డ కొందరు బీజేపీ నేతలు కూడా, సోము వీర్రాజు వాదనతో ఏకీభవించడమే కాదు, సోము వీర్రాజు లైన్‌లోనే ‘అమరావతి నుంచి రాజధానిని తరలించడం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వల్ల కాదు..’ అని తెగేసి చెబుతున్నారు. అంటే, బీజేపీ అధిష్టానం నుంచి ఈ విషయమై రాష్ట్ర బీజేపీ నేతలకు ఖచ్చితమైన సమాచారం వుందన్నమాట.

అదే నిజమైతే, విశాఖ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విషయమై వైసీపీ ఎవర్ని సంప్రదించినట్లు.? ప్రధాని నరేంద్ర మోడీని సంప్రదించాకనే, విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా వైసీపీ నిర్ణయించిందా.? మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ బీజేపీ నేతలు, ‘అమరావతికి జై’ అంటున్నారా.? మొత్తమ్మీద, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలిప్పుడు బీజేపీలో అంతర్గతంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. విజయసాయి వ్యాఖ్యల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదనీ, ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో వుందనీ, బీజేపీ నినాదం అమరావతి రాజధాని మాత్రమేననీ ఏపీ బీజేపీ కుండబద్దలుగొట్టి మరీ చెప్పేస్తోంది.

అయితే, హైకోర్టును మాత్రం రాయలసీమకు ఇవ్వాలనీ, కర్నూలులో హైకోర్టు పెట్టాలనీ బీజేపీ నినదిస్తుండడం గమనార్హం. కానీ, హైకోర్టు మార్చాలంటే.. అది కేంద్ర ప్రభుత్వ జోక్యంతోనే జరగాలి.. రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలి.. సుప్రీంకోర్టు పరిధిలోని అంశం కూడా. ఆ సంగతి వైసీపీకి కూడా బాగా తెలుసు. కానీ, అసెంబ్లీలో చట్టం చేసేసి ‘జ్యుడీషియల్‌ క్యాపిటల్‌’ అంటూ వైసీపీ ప్రభుత్వం ఎలా ప్రకటించేసిందట.? ఇంతా చేసి, ‘అది ప్రతిపాదన మాత్రమే..’ అని హైకోర్టుకి ఎలా వైసీపీ ప్రభుత్వం సమాచారమిచ్చిందట.? చాలా ప్రశ్నలున్నాయ్‌.. కానీ, సమాధానాలే దొరకడంలేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...