Viral News: వావివరుసలకు విరుద్ధంగా అన్న భార్య (వదిన)తో కాపురం చేసి ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యాడో మరిది. అది చాలదన్నట్టు మరో వివాహానికి సిద్ధపడ్డాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. నల్లబెల్లి మండలంలోని బజ్జుతండా పరిధిలోని చిన్నతండాకు చెందిన రాజు.. చెన్నారావుపేట మండలం ఎల్లాయగూడెంకు చెందిన మమతతో 2017లో వివాహమైంది. ఎన్నాళ్లైనా వీరికి పిల్లలు పుట్టకపోవడంతో మమత పుట్టింటికి వెళ్లిపోయింది. ఈక్రమంలో ఆసుపత్రిలో చూపిస్తామంటూ అత్తమామలు, మరిది కలిసి మమతను ఇంటికి తీసుకొచ్చారు.
రాజుతో పిల్లలు పుట్టరని.. మరిది శ్రీనుతో కాపురం చేస్తే పిల్లలు పుడతారు.. ఆస్తి మనవద్దే ఉంటుందని నమ్మించి మరిదితో కాపురం చేయించారు. వీరికి బాబు, పాప జన్మించారు. ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా జరిగిన వ్యవహారంలో గొడవలు వచ్చాయి. మమతను ఇంటి నుంచి వెళ్లగొట్టి శ్రీనుకు మరో పెళ్లి చేయాలని నిశ్చయించి నిశ్చితార్ధం జరిపించారు. విషయం తెలుసుకుని వారితో గొడవకు దిగింది మమత. వారు తెగేసి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించింది మమత. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.