Vangalapudi Anitha: ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆంధ్రాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారంటూ అధికార వైసిపి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు తనని ప్రలోభ పెట్టినట్టు మొన్నటికి మొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆరోపించారు.
పది నుంచి 20 కోట్లు డబ్బు ఆశ చూపి తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవాలని టీడీపీ యత్నించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఆరోపించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల విమర్శలకు తెలుగు దేశం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కౌంటర్ విసిరారు. తాజాగా విశాఖలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
‘ ఈ ప్రభుత్వం లో జరిగినన్ని దారుణాలు ఎప్పుడు జరగలేదు. తిరుమల పై గంజాయి దొరకడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి బాధతో మాట్లాడుతుంటే ఆమెపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య. ఆమెను మంత్రి అమర్నాథ్ ఊసరవెల్లి అని సంబోధించడం దారుణం. డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం ముఖ్యమంత్రికే చెల్లింది. ఎంత డబ్బు ఆశ చూపించి రాపాక వరప్రసాద్ ను జనసేన నుంచి వైసీపీలోకి రప్పించారో మీకే తెలియాలి. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాకు కాంటాక్ట్ లో ఉన్నారన్న విషయం తెలిస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి పక్షవాతం రావడం ఖాయం. వైసీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
22682 59495Thrilled you desire sensible business online guidelines maintain wearing starting tools suitable for the specific web-based business. cash 273843
Esto puede ser molesto cuando sus relaciones se interrumpen y no se puede rastrear su teléfono. Ahora puede realizar esta actividad fácilmente con la ayuda de una aplicación espía. Estas aplicaciones de monitoreo son muy efectivas y confiables y pueden determinar si su esposa lo está engañando.