ఉండవల్లి అరుణ్కుమార్.. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ రేంజ్లో హల్చల్ చేశారు. రాజమండ్రి ఎంపీగా గతంలో పనిచేసిన ఉండవల్లి, రాజకీయ నాయకుడిగా కంటే కూడా.. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకి ప్రత్యర్థిగానే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. దానిక్కారణం, మార్గదర్శి సంస్థపై ఆయన న్యాయపోరాటం చేయడమే. మార్గదర్శి సంస్థపై ఉండవల్లి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అప్పుడప్పుడే ఈ కేసు తెరపైకి వస్తూ వుంటుంది.
తాజాగా, ఈ కేసు మరోమారు వార్తల్లోకెక్కింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కాగా, తాజా పరిణామాలపై స్పందించిన ఉండవల్లి అరుణ్కుమార్, సుప్రీం ఇచ్చిన ఆదేశాల్ని స్వాగతిస్తున్నామని ఉండవల్లి అంటున్నారు. అంతే కాదు, ఈ కేసులో దోషిగా తేలితే రామోజీరావు భారీ స్థాయిలో జరీమానా చెల్లించాల్సి వస్తుందని ఉండవల్లి చెబుతుండడం గమనార్హం. ఈ మొత్తం 7 వేల కోట్లు వుండబోతోందట.
దాంతోపాటుగా, రెండున్నరేళ్ళ జైలు శిక్ష కూడా రామోజీరావుకి తప్పదన్నది ఉండవల్లి ఉవాచ. చాలా ఏళ్ళుగా నలుగుతున్న వ్యవహారమిది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్రెడ్డి మద్దతుతో ఉండవల్లి అరుణ్కుమార్ చెలరేగిపోయారు. ఆ తర్వాతి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
మరోపక్క, హైకోర్టు మొట్టికాయలతో డిపాజిట్లను డిపాజిట్దారులకు మార్గదర్శి సంస్థ తిరిగి చెల్లించేసినట్లు ప్రచారం జరిగింది. దానిపైనా ఉండవల్లి అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఏదిఏమైనా, ఏళ్ళ తరబడి ఓ కేసు విషయంలో ఇంత పట్టుదలగా వ్యవహరించడం ఉండవల్లికే చెల్లింది. అన్నట్టు, ఉండవల్లి రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ కూడా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఆ విషయంలో ఆయనెందుకు అంత పట్టుదల చూపలేదన్నది ఆశ్చర్యకరం.
994391 267033I adore foregathering beneficial information , this post has got me even a lot more information! . 742718