Switch to English

తెలుగు రాష్ట్రాలు.. ఒకటి అలా మరొకటి ఇలా..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరస్పర విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. విభజన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుండగా.. లోటు బడ్జెట్ తో ఉన్న ఏపీ మాత్రం రాజకీయపరమైన విభేదాలు, గొడవలతో అంతకంతకూ వెనకబడుతోంది. ప్రస్తుతం ఏపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఏపీ రాజధానిగా అమరావతితోపాటు విశాఖ, కర్నూలును ఎంపిక చేస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై అటు అమరావతి ప్రాంత ప్రజలతోపాటు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. హైకోర్టు కూడా రాజధాని తరలింపు ప్రక్రియను ఆపాలంటూ స్పష్టంచేసింది. మరోవైపు శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి సదరు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించే విషయంలో విజయం సాధించింది.

దీంతో అహం దెబ్బతిన్న అధికార పార్టీ.. ఏకంగా మండలినే రద్దు చేసే దిశగా పావులు కదుపుతోంది. నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమలులపై మినహా అభివృద్ధిని పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని పలువురు పేర్కొంటున్నారు. అయితే, రాజధానుల వికేంద్రీకరణ ద్వారా తాము రాష్ట్రం మొత్తాన్ని సమానంగా అభివృద్ధి చేస్తామని అధికార పార్టీ చెబుతోంది.

అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. వెరసి రాష్ట్రంలో గందరగోళం రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఉండదని.. అధికార, ప్రతిపక్షాల బెట్టు కారణంగా రాష్ట్రం అధోగతి పాలయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ మాత్రం తెలివిగా ముందుకెళుతోంది. ఇప్పటికే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. మరిన్ని పెట్టుబడుల సాధన కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్స్ లీడర్స్ సమ్మిట్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన మంత్రి కేటీఆర్.. పలువురు ప్రముఖ కంపెనీల అధిపతులతో సమావేశమై పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు.

పెట్టబడులకు తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని, పైగా అనుమతుల విషయంలో తాము ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని అందరికీ వివరిస్తూ.. పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే పిరమాల్ గ్రూప్ రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధం కాగా, కోకోకోలా సైతం అందుకు అంగీకారం తెలిపింది. ఇలా తమ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ పరితపిస్తుండగా.. ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం దీనిని విస్మరిస్తున్నానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఇరు వర్గాలు పట్టుదలకు పోకుండా రాష్ట్రానికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...