ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాల్లో నటించేందుకు రెడీ అయిన పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో పవన్ అక్కడ పరిణామాలు సరిచేసే పనిలో ఉన్నాడు. అయితే పింక్ రీమేక్ సినిమాలో నటించేందుకు అయన ఓ కండిషన్ పెట్టాడట, అది విన్న నిర్మాత మొదట్లో షాక్ అయినప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకుని ఓకే చెప్పినట్టు టాక్.
ఇంతకీ పవన్ డిమాండ్ చేసిన విషయం ఏమిటో తెలుసా .. తాను రోజు అమరావతి నుండి హైద్రాబాద్ వచ్చి షూటింగ్ లో పాల్గొనడం చాలా టైం వెస్ట్ అవుతుంది కాబట్టి .. ఓ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయమని అడిగాడట ? దానికి దిల్ రాజుఁ కూడా ఓకే అనడంతో పవన్ కోసం ఓ ప్రత్యేక విమానాన్నీ ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నాడు. ఈ సినిమా కోసం పవన్ 30 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట, సో రెగ్యులర్ గా షూటింగ్ కు రావడానికి, మళ్ళీ అమరావతికి వెళ్ళడానికి ఈ విమాన సర్వీస్ నడుస్తుంది. దీనికోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు టాక్.
బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన పింక్ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నివేద థామస్, అంజలి నటిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత బోణి కపూర్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను మే 23న విడుదల చేస్తారట. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మీడియాలో ట్రేండింగ్ అవుతుంది. ఈ సినిమాకు లాయర్ సాబ్ అనే టైటిల్ పెడుతున్నట్టు సమాచారం.
708357 809887Some genuinely select articles on this internet web site , bookmarked . 568301
699894 404812Hey mate, .This was an exceptional post for such a hard topic to speak about. I appear forward to seeing numerous much more superb posts like this 1. Thanks 151868