విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. కార్మికులు, ఉద్యోగుల నిరసన సెగ ఇప్పుడు టాలీవుడ్ ను తాకింది. మంచు విష్ణు, కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘మోసగాళ్లు’ సినిమా టీమ్ను ఉక్కు ఉద్యమకారులు అడ్డుకున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా టీమ్ ఈరోజు విశాఖ వెళ్లింది. ఈనేపథ్యంతో టీమ్ ను అడ్డుకున్న ఉద్యమకారులు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఉక్కు ఉద్యమకారులు మాట్లాడుతూ.. సినిమా షూటింగులు, సినిమా ఫంక్షన్ల కోసం ఏపీకి ఎవరొచ్చినా అడ్డుకుంటామని అన్నారు. ఉక్కు ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతుంటే సినీ పరిశ్రమ మద్దతు తెలపాలని వారు అన్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. హీరోలు ఆర్. నారాయణమూర్తి, సుధీర్ బాబు కూడా సంఘీభావం తెలిపారు. మోసగాళ్లు టీమ్ ను ఉద్యమకారులు అడ్డుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
451341 985922Some times its a pain inside the ass to read what individuals wrote but this web site is real user genial ! . 532030