కరోనా మహమ్మారి దేశంలో ఎవరికీ కునుకు లేకుండా చేస్తోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి పంజాకు ఆలయాల్లోని అర్చకులు కూడా బలైపోతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో మృత చెందారు.
అనారోగ్యంతో 4 రోజుల క్రితం కరోనాతో స్విమ్స్లో చేరిన ఆయనకు కరోనా లక్షణాలు గుర్తించారు డాక్టర్లు. పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసాచార్యులుకు మధుమేహంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని స్విమ్స్ వైద్యులు తెలిపారు. గోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తించే శ్రీనివాసాచార్యులు కొన్నాళ్ల క్రితం డిప్యూటేషన్పై తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చారు.
అర్చకుడు శ్రీనివాసాచార్యులు మృతిని తితిదే అధికారికంగా ప్రకటించింది. తిరుమలలో కైంకర్యాలు నిర్వహించే అర్చకుడు కరోనాతో మృతి చెందడం బాధించే విషయమంని తితిదే ఛైర్మన్, ఈవో అన్నారు. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాసాచార్యులు మృతి దురదృష్టకరమని ఆయన కుటుంబానికి తితిదే నిబంధనల ప్రకారం సహాయం అందిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.
599166 274845Thank you for this. Thats all I can say. You most certainly have produced this into something thats eye opening and crucial. You clearly know so much about the subject, youve covered so many bases. Wonderful stuff from this part with the internet. 976764
909527 709933How do I know if a Wordpress theme supports a subscribe option? 993734
958865 289005Some truly superb articles on this internet web site , regards for contribution. 795555