హర్యానా సోనిపట్కు చెందిన శివానీ ఇటీవల హత్యకు గురి అయ్యింది. ఆమె నిర్వహిస్తున్న బ్యూటీ పార్లల్లోనే ఆమె మృతదేహం కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా ఆమె స్నేహితుడు ఆరిఫ్ ఆమెను హత్య చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. ఆమెకు టిక్ టాక్ ద్వారా వచ్చిన గుర్తింపును భరించలేక ఆమెను హత్య చేసినట్లుగా శివానీ తండ్రి పేర్కొన్నాడు.
శివానీ ఇంటి పక్కనే ఉండే ఆరిఫ్ కొంత కాలంగా ఆమెను ఇబ్బంది పెడుతూ ఉన్నాడని, అందుకే తాము ఇంటిని మార్చి దూరంగా వెళ్లామని అన్నాడు. కొత్త ఇంటి అడ్రస్ను తెలుసుకుని అక్కడకు కూడా ఆరిఫ్ వచ్చేవాడని ఆమె తండ్రి అన్నాడు. ఇటీవల శివానీ బ్యూటీ పార్లల్కు వెళ్లిన సమయంలో ఆమె రాలేదు. ఫోన్ చేయగా ఆమె స్పందించక పోవడంతో ఏం జరిగిందో అనే అనుమానం వచ్చింది. అయితే ఆమె మిస్ అయిన రెండు రోజుల వరకు కూడా టిక్టాక్ వీడియోలు పోస్ట్ అవ్వడంతో వారికి అనుమానం రాలేదు. చివరకు ఆరిఫ్ ఆమెను బ్యూటీ పార్లల్కు వెళ్లి మరీ చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు.
607279 91080I conceive this internet internet site holds some real superb data for everybody : D. 11593