Tharun Bhaskar: తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’. ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమాలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ను ఏఐ టెక్నాలజీలో ఉపయోగించింది చిత్ర యూనిట్. దీనిపై తమ అనుమతి తీసుకోకపోవడంపై తరుణ్ భాస్కర్ కు ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ లీగల్ నోటీస్ ఇచ్చినట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. దీనిపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు.
‘మనకున్న గొప్ప కళాకారులను ఏదొక రూపంలో గౌరవించుకోవాలని అందరికీ ఉంటుంది. అగౌరవపరచాలనే ఉద్దేశం ఏమాత్రం ఉండదు. బాలుగారి వాయిస్ తో నేను వాణిజ్యపరమైన అంశాలు తెరకెక్కించాలని భావించలేదు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశంతోనే అలా చేశాం. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. పరిమితుల్లో కొత్తగా ట్రై చేయాలి. అయితే.. మా మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వల్ల సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ మేం పరిష్కరించుకున్నా’మని అన్నారు.