తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినేట్ సూచన మేరకు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మొదటి సంవత్సరం పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన ఇంటర్ బోర్డు తాజాగా సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా రద్దు చేసినట్లుగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్మీషన్ ఉన్న వారు అంతా కూడా పాస్ అవ్వబోతున్నారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అవకాశం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఎంసెట్ మరియు డిగ్రీ అడ్మీషన్ లను పొందేందుకు ప్రతి ఒక్కరు అర్హులే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. అయితే ఇంటర్ వెయిటేజ్ ఆధారంగా గతంలో ఇంజనీరింగ్ అడ్మీషన్ ఉండేది. మరి ఇప్పుడు ఎలా నిర్ణయిస్తారు అనేది చూడాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దుకు ప్రభుత్వం ఓపె చెప్పిన నేపథ్యంలో లక్షల మంది విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ తో పాటు పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు కూడా రద్దు చేసిన నేపథ్యంలో టీ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయానికి వచ్చింది.
761731 25682All you want to know about News details to you. 498291
229978 948557Very well written story. It is going to be valuable to anyone who usess it, including yours truly . Keep up the great function – canr wait to read more posts. 398791