ఇటీవలే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా తీన్మార్ మల్లన్న తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 7,200 పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన తీన్మార్ మల్లన్న ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇకపై తాను బీజేపీ కార్యాలయానికి వెళ్లను అంటూ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నారా లేదా బిజెపి ని వదులుతున్నారా అనే విషయంపై అధికారికంగా ప్రకటించక పోయినా కూడా ఆయన బీజేపీ తో మాత్రం లేను అన్నట్లుగా స్పష్టం చేశారు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ మరియు బీజేపీల తో పాటు రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీంటిపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న వారి సంఖ్య 7,200 అంటూ చెప్పుకొచ్చారు. అదే ఆ సంఖ్య పేరు తో ఉద్యమాన్ని మొదలు పెట్టానని పేర్కొన్నాఉడ. ఉద్యమం త్వరలోనే ఉదృతం కాబోతున్నట్లుగా మల్లన్న ప్రకటించారు. తాము చేపట్టబోయే ఉద్యమం ప్రతి ఒక్కరిలో ఆలోచన తీసుకు వస్తుందని… ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించడంతో పాటు ఉచిత విద్య మరియు ఆరోగ్యాన్ని అందించే విధంగా తాము ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో తమ ఉద్యమం రాజకీయ మలుపు తీసుకుంటుందని కూడా పేర్కొన్నాడు.
566477 375901This internet site is my breathing in, actually great layout and perfect content . 67181