టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును ఏపీ సీఐడీ అధికారులు గురువారం రాత్రి 11:30 సమయంలో ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేశారు. అశోక్ బాబును గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అశోక్బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గతంలో లోకాయుక్తకు మెహర్ కుమార్ అనే వ్యక్తి గతంలో ఫిర్యాదు చేశారు.
దీనిపై నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఫిర్యాదు చేయాలని శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి జనవరి 25న సీఐడీకి ఫిర్యాదు చేశారు. అశోక్బాబుపై 477A, 465, 420 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మరోవైపు.. అశోక్బాబు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఖండించారు. అశోక్బాబును కలిసేందుకు వెళ్లిన దేవినేని ఉమను పోలీసులు నేడు అరెస్టు చేశారు.
935117 533973But wanna comment on couple of common items, The web site style is perfect, the content material material is actually great : D. 737973