ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పార్టీలు ప్రచారాన్ని పరిగెట్టిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన తమ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు, విజయవాడల్లో ఆసక్తికర సంఘటన జరిగింది. జనసేన అభ్యర్ధుల గెలుపు కోసం టీడీపీ నాయకులు ప్రచారం చేయడం విస్తుగొలుపుతోంది. ఏలూరు 25వా వార్డులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రచారం చేశారు. టీడీపీ ఇక్కడ పోటీలో లేనందున జనసేన గెలుపుకు ప్రచారం చేస్తున్నానని ప్రకటించారు.
Vijayawada https://t.co/WDKwKYqMbl
— @Jspజాఫర్ 2 (@urs_jafar2) March 7, 2021
విజయవాడలోని రామలింగేశ్వర్ నగర్ లోని 15వ వార్డులో జనసేన అభ్యర్ధి గెలుపు కోసం టీడీపీ నాయకుడు వంగవీటి రాధా ప్రచారం చేశారు. ఇలా ఇద్దరు టీడీపీ నాయకులు జనసేన కోసం ప్రచారం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అనుమతి లేకుండానే ఇలా చేస్తున్నారా? మళ్లీ జనసేన-టీడీపీ కలుస్తాయా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. టీడీపీ తరపున చంద్రబాబు ప్రచారం చేస్తూండగా.. జనసేన తరపున ఇంకా పవన్ కల్యాణ్ ప్రచారమే ప్రారంభించలేదు.
జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి !! pic.twitter.com/nqK7OT01Uq
— శ్రీనివాస్ ఉత్తరాంధ్ర (@sriniva53145815) March 7, 2021
990607 157362Respect to web site author , some great selective info . 58366
277689 349854An incredibly fascinating go through, I might not concur entirely, nevertheless you do make some truly legitimate factors. 902081