పాకిస్థాన్ లో ఘోరం జరిగింది. ఓ హిందూ కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ లోని ముల్తాన్ ప్రాంతం రహీమ్ యార్ లోని అబుదాబి కాలనీలో హిందూ కుటుంబం నివసిస్తోంది. కుటుంబ పెద్ద రామ్ చంద్ టైలరింగ్ చేస్తూ కుటాంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం గుర్తు తెలియని కొందరు దుండగులు ఆయన నివాసంలోకి చొరబడి ఆయన కుటుంబసభ్యులపై దాడికి తెగబడ్డారు.
పదునైన కత్తులు, గొడ్డళ్లతో అయిదుగురు కుటుంబసభ్యులను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. నిందితులంతా హత్యా స్థలంలోనే మృతి చెందారు. ఈ కుటుంబం ప్రశాంతమైన జీవనం గడుపుతారని స్థానికులు అంటున్నారు. తీవ్ర కలకలం రేపిన ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇటివల పాకిస్థాన్ లో హిందూ కుటుంబాలపై దాడులు ఎక్కువయ్యాయని అక్కడి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.