తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు.? ఒకర్ని మించి ఇంకొకరు.. రాజకీయాల్ని భ్రష్టు పట్టించేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నది నిర్వివాదాంశం.
టీడీపీ నేత పట్టాభి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, అంతకన్నా దారుణమైన, హేయమైన వ్యాఖ్యల్ని టీడీపీకి చెందిన చాలామంది నేతలు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మీద చేశారు. టీడీపీ నేతలవీ బూతులే, వైసీపీ నేతలవీ బూతులే.. కానీ, వైసీపీ నేతలవే బూతులని టీడీపీ, టీడీపీ నేతలవే బూతులని వైసీపీ.. చిత్ర విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి.
వ్యవహారం ముదిరి పాకాన పడి, దాడుల వరకూ వెళ్ళింది. వాస్తవానికి, అధికార పార్టీ ఇంతలా దిగజారిపోవడం ఇదే కొత్త కాదు. టీడీపీతోపాటు వైసీపీ, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలూ.. ఇక్కడ బాధిత పార్టీల కిందనే లెక్క. సేమ్ టు సేమ్ టీడీపీ వల్ల కూడా మిగతా పార్టీలు బాధిత పార్టీలుగా మారిన సందర్భాలున్నాయి.
టీడీపీ, వైసీపీ కలిసికట్టుగా ఓ అవగాహనతో రాష్ట్రం పరువుని బజార్న పడేశాయి. రాష్ట్ర ప్రజల దృష్టిలో పలచనైపోయాయ్. ఇది చాలదన్నట్టు, రాష్ట్రం పరువుని ఢిల్లీలో కూడా తీసెయ్యాలన్న కోణంలో రెండు పార్టీలూ పోటా పోటీగా ఢిల్లీ యాత్రలకు సిద్ధమవుతున్నాయట. టీడీపీ గుర్తింపుని రద్దు చేయాలని వైసీపీ, వైసీపీ గుర్తింపుని రద్దు చేయాలని టీడీపీ.. కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేస్తాయట.
కేంద్ర మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి తదితరులకు ఫిర్యాదు చేసేందుకు ఇరు పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఏమని ఫిర్యాదు చేస్తారు.? ఏమని చెబుతారు.? తాము నిస్సిగ్గుగా వాడిన బూతు తిట్లను కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరిస్తారా.? తాము చేస్తున్న నీఛ రాజకీయాల గురించి ఢిల్లీ స్థాయిలో ఘనంగా చెప్పుకుంటారా.?
గల్లీలో పోయిన పరువు.. ఢిల్లీలో కూడా వుండకూడదన్న కోణంలో.. టీడీపీ, వైసీపీ.. ఓ ఖచ్చితమైన వ్యూహంతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
588239 33927Superb blog here! Also your internet site loads up very rapidly! What host are you employing? Can I get your affiliate link to your host? I wish my web site loaded up as quick as yours lol xrumer 745329