ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్.. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. 25 పార్లమెంటరీ, 175 అసెంబ్లీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ నష్టపోయాయని.. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలకు న్యాయం కోసం పోరాడాలని అన్నారు. జగన్ రెడ్డి అసమర్ధ, స్వార్ధపూరిత విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని.. వైసిపి రౌడీయిజం, సెటిల్మెంట్లపై గట్టిగా పోరాడాలని నేతలకు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి దగ్గర డబ్బు, అధికారం ఉంటే.. టీడీపీకి ప్రజాబలం ఉందని అన్నారు. పని చెయ్యని నాయకుల్ని పార్టీ భరించాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. టీటీడీ బోర్డు నిర్ణయాలతో భక్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.
త్వరలోనే టీడీపీ ఆన్ లైన్ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నామని అన్నారు. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ 100వ జయంతి, మహానాడుకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సమావేశంలో సంతాపం తెలిపారు.
918841 940522I was reading via some of your content on this internet website and I believe this website is really instructive! Keep putting up. 326651