ప్రస్తుతం అల్లు అర్జున్ తో క్రేజీ దర్శకుడు సుకుమార్ చేయబోయే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మద్యే గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా ఎర్రచందం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని, ఇందులో అల్లు అర్జున్ డ్రైవర్ గా కనిపిస్తాడంటూ ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఈ సినిమాకోసం చిత్తూరు యాసలో మాట్లాడే అక్కడి వారిని నటీనటులుగా ఎంపిక చేసాడు సుకుమార్. సినిమా ఎక్కువ భాగం అడవిలో చిత్రీకరణ ఉంటుంది కాబట్టి .. తాజాగా టెస్ట్ షూట్ కూడా నిర్వహించారట. నటీనటులను తీసుకుని కేరళ వెళ్లారని, అక్కడ టెస్ట్ షూటింగ్ జరిపారట. ఆ షూట్ తో సినిమా అంతా ఎలా తీయాలో పక్క ప్లాన్ రెడీ చేసాడట సుక్కు.
అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి ఏమాత్రం తీసిపోని విధంగా సుక్కు సినిమాను తీసే ఆలోచనలో ఉన్నాడు. అల్లు అర్జున్ సరసన కన్నడ భామ రష్మిక మండన్న హీరోయిన్ గా నటించే ఈ సినిమాను మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. జనవరి నుండి రెగ్యులర్ షూట్ మొదలెట్టి .. ఏకధాటిగా చిత్రీకరణ జరిపి సినిమాను దసరాకు విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
131455 169601It is difficult to acquire knowledgeable individuals about this topic, and you sound like what happens youre speaking about! Thanks 258894
785839 491969There is noticeably big dollars to realize about this. I suppose you made certain good points in attributes also. 235516