ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త రాజధానుల విషయమై వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని అమరావతిని వీలైనంత త్వరగా కాలగర్భంలో కలిపేయబోతున్నారు. ‘ఇప్పుడున్న అసెంబ్లీలోనే ఇకపైనా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి..’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అంటే, కొత్తగా శాశ్వత అసెంబ్లీ అమరావతిలో కట్టే అవకాశం వుండదన్నమాట. విశాఖలో వేసవికాల సమావేశాలు నిర్వహించేలా అక్కడో అసెంబ్లీ నిర్మించాల్సిన ఆవశ్యకతను జీఎన్ రావు కమిటీ ప్రస్తావించిన విషయం విదితమే. మరోపక్క, కర్నూలులో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే డిమాండ్ తెరపైకొస్తోంది. అంటే, అక్కడ కూడా ఓ అసెంబ్లీ కట్టాల్సి వస్తుందన్నమాట.
ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం.. ఇలా మూడు కాలాల్లో మూడు చోట్ల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయేమో. ఇదిలా వుంటే, విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం కోసం స్థలాన్వేషణ జరుగుతోంది. ఓ భారీ భవంతిని ఇప్పటికే ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. దానికి ఆనుకునే వున్న మరో భవనాన్ని సెక్రెటేరియట్గా వాడబోతున్నారట. విజయవాడ నుంచి విశాఖకు ఉద్యోగుల్ని తరలించే దిశగా కూడా సమాలోచనలు జరుగుతున్నాయట.
ఈ వేగం చూస్తోంటే, కొత్త ఏడాదిలో పాలన కొత్త రాజధాని విశాఖ నుంచే జరగొచ్చన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, కొత్త ఏడాది రెండో క్వార్టర్ లేదా, రెండో అర్థ భాగం నుంచి.. అంటే మార్చి తర్వాత.. లేదంటే జూన్ తర్వాత మాత్రమే విశాఖ నుంచి పాలన ప్రారంభం కావొచ్చన్న ఊహాగానాలూ విన్పిస్తుండడం గమనార్హం. ఈ నెల 27న జరిగే క్యాబినెట్ భేటీ తర్వాత అన్ని విషయాలపైనా స్పష్టత రావొచ్చు.
64953 687101Nowhere on the Internet is there this a lot quality and clear info on this subject. How do I know? I know because Ive searched this topic at length. Thank you. 86474
182908 106016hello, i came in to learn about this subject, thanks alot. will put this internet site into my bookmarks. 830672
754669 63204I genuinely enjoyed this. It was extremely educational and useful. I will return to examine on upcoming posts 689718
129562 332567Its very good as your other content : D, appreciate it for posting . 176517