Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక, ప్రకటనలు పూర్తయ్యాయి. దీంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకులు ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. జనసేన (Janasena) కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నియోజకవర్గాలవారీగా పర్యటనలు ప్రచారం చేస్తున్నారు.. మరోవైపు పిఠాపురం నుంచి పోటీ చేయనున్నారు.
ఈక్రమంలో పార్టీకి స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు పవన్ కల్యాణ్. సినీ ఇండస్ట్రీ నుంచి జనసేన పార్టీలో చేరిన వారిని ప్రచారానికి అధినేత ప్రకటించారు. వారిలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ మాస్టర్ జానీ, సినీ, టీవీ నటుడు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను ప్రచారకర్తలుగా ప్రకటించారు.
దీంతో సినీ సెలబ్రిటీల నుంచి జనసేనకు ప్రచారం కలిసిరానుంది. ఇప్పటికే వీరంతా వివిధ వేదికలు.. సందర్భాల్లో జనసేన పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలు.. పవన్ కల్యాణ్ ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.