‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దాదాపు 5 నెలల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి తన 27వ సినిమా న్యూస్ వచ్చింది. చాలా రోజులుగా మహేష్ బాబు నెక్స్ట్ సినిమా గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ తో ఉంటుందనే వార్తలు ఉన్నాయి. దానిపై మే 30న మైత్రి మూవీ మేకర్స్ – 14 రీల్స్ ప్లస్ వారు అధికారికంగా క్లారిటీ ఇవ్వడమే కాకుండా మే 31న కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఈ చితా టైటిల్ ని రిలీజ్ చేసాయనున్నట్లు అనౌన్స్ చేశారు.
అన్నట్లు గానే మహేష్ బాబు – పరశురామ్ డైరెక్షన్ లో వచ్చే మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని 9గం 09 నిమిషాలకి రిలీజ్ చేశారు. మహేష్ 27వ సినిమాకి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ పోస్టర్ ద్వారా గత కొద్దీ రోజులుగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఉన్న సస్పెన్స్ వీడింది. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మొదట ఈ సినిమాని తక్కువ మందితో సింపుల్ గా లాంచ్ కార్యక్రమం చేయాలనుకున్నారు. కానీ మహేష్ మాత్రం కరోనా ఎఫెక్ట్ టైంలో మన వల్ల నలుగురిని రిస్క్ లో పడేయడం ఎందుకని చెప్పడంతో నిర్మాతలు కూడా ఒప్పుకొని డిజిటల్ రిలీజ్ కి వెళదాం అనుకొని, ఫస్ట్ లుక్ మరియు డీటైల్స్ ని ప్రెస్ నోట్ ద్వారా ఆన్ లైన్ లో రిలీజ్ చేసేలా నిర్మాతలు ప్లాన్ చేశారు.
‘బ్యాంకింగ్ రంగంలో మరియు ఆర్థికపరమైన వ్యవస్థల్లో జరుగుతున్న మోసాలను’ ప్రధాన ఇతి వృత్తంగా చేసుకొని చేస్తున్న ఈ సినిమాలో లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయని సమాచారం.
375312 303595Aw, this was a quite nice post. In concept I wish to put in writing like this moreover ?taking time and precise effort to make an superb write-up?but what can I say?I procrastinate alot and definitely not appear to get one thing done. 816680
964067 104603I see something genuinely unique in this internet site . 256617