ప్రత్యేక హోదా అంటే మరీ వెటకారం అయిపోయింది రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకి. తెలుగుదేశం పార్టీ, బీజేపీతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగింది ప్రత్యేక హోదా కోసమే. నరేంద్ర మోడీ, ప్రధాని అవకముందు తిరుపతి వేదికగా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత మాట మార్చారు. అయినా, టీడీపీ – బీజేపీతో నాలుగేళ్ళు రాజకీయ సంసారం చేసింది, చివరి సంవత్సరంలో విడాకులు తీసుకుంది.
అప్పట్లో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేసిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక.. ‘అడుగుతూనే వుంటాం..’ అని చెబుతున్నారు ప్రత్యేక హోదా కోసం. రెండేళ్ళు ఎలాగోలా గడిపేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి హోదాలో. మిగిలిన మూడేళ్ళలో వీలు చిక్కినప్పుడల్లా ప్రధానిని ప్రత్యేక హోదా అడిగేసి, ‘మమ’ అనిపించేస్తారు.
ఎటూ బులుగు మీడియా, ‘జగన్ మాటంటే మాటే.. ప్రత్యేక హోదా కోసం జగన్ చూపిస్తున్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు..’ అంటూ భజన చేస్తుందనుకోండి.. అది వేరే విషయం. అడగాలి, అడుగుతూనే వుండాలి. ఏడాది అడిగారు.. రెండో ఏడాది కూడా అడుగుతూనే వున్నారు. ఎన్నాళ్ళిలా ‘అడగడంతోనే సరిపెడతారు.?’ అన్న విషయమై జనం ఆశ్చర్యపోతున్నారు, ఆవేదన చెందుతున్నారు. కేంద్రం మెడలు వంచేదెప్పుడు.? అది చేతకానప్పుడు ఎన్నికల ప్రచారంలో ‘వంచేస్తాం’ అంటూ ప్రగల్భాలు పలికిందెందుకు.? అని జనం నిలదీయకపోవడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థతి.
ప్రత్యేక హోదా రాలేదు, ప్రత్యకే ప్యాకేజీ రాలేదు. రాజధాని లేదు, స్టీలు ప్లాంటు, పోర్టు, పోలవరం.. ఇలా అన్నిటిలోనూ రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యే చూపిస్తోంది. ఇదంతా చాలదన్నట్టు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామంటోంది. టీడీపీ – వైసీపీ మాత్రం ఒకరి మీద ఇంకొకరు బురద చల్లుకుంటూ టైమ్ పాస్ చేసేస్తుండడం గమనార్హం. ఈ రెండు ప్రధాన పార్టీలూ ఒక్కతాటిపైకొచ్చి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడితే, రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. కానీ, అలా చేస్తే.. ముందుగా తమ ముఖ చిత్రాలు మారిపోతాయేమోనన్నది ఆ రెండు పార్టీల అధినేతల ఆవేదన. అదీ అసలు సంగతి.
254232 452076This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for usually trying to drop the weight as effectively within the have a much healthier lifetime. shed weight 983196